ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Aug 6, 2022, 8:59 AM IST

Updated : Aug 6, 2022, 12:50 PM IST

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

..

  • వైకాపా సర్కారుకు.. మరో సలహాదారు వచ్చారు!
    Endowment adviser: రాష్ట్రంలో మరో సలహాదారుడు వచ్చారు. ప్రభుత్వ పెద్దలను సైతం తన వద్దకు రప్పించుకునే ఓ కీలక స్వామీజీ ఆశీస్సులున్న వ్యక్తిని దేవాదాయశాఖ సలహాదారుగా పదవి వరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఎవరంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు దిల్లీకి జగన్‌, చంద్రబాబు.. ఎందుకంటే..?
    Jagan Delhi tour: నేడు సీఎం జగన్​ దిల్లీ వెళ్లనున్నారు. విశాఖ నుంచి రాత్రి 7.50 నిమిషాలకు సీఎం జగన్​ పయనమవుతారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు కూడా దేశ రాజధానికి వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Rain Alert : నేడు, రేపు అతి భారీ వర్షాలు!
    Telangana Rain Alert : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ground Nuts: పెట్టుబడి పైపైకి.. దిగుబడి పాతాళానికి..
    రాష్ట్రంలో వేరుసెనగ సాగు క్రమంగా తగ్గిపోతోంది. జులైలో వర్షాభావంతో సాగు మరింత తగ్గిపోయింది. పెట్టుబడి పైపైకి వెళ్తూ... దిగుబడి పతనమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక ప్రత్నామ్నాయ పంటలపై రైతుల దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైటెక్‌ యుద్ధాలకు భారత్‌ సన్నద్ధం.. కొత్త వ్యూహాలకు పదును!
    HIGH TECH WAR INDIA: హైటెక్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై భారత్ దృష్టిపెట్టింది. ఆధునిక కమ్యూనికేషన్‌, సైబర్‌, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం చేపట్టింది. దీని ఆధారంగా వ్యూహాలకు పదును పెడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vice president election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనమే
    Vice president election: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ ఆళ్వా (80) రంగంలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటు భవనంలో కొనసాగనుంది. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్వేతసౌధం వద్ద పిడుగు- ముగ్గురు మృతి.. అగ్నిప్రమాదంలో మరో 10 మంది
    WHITEHOUSE LIGHTINING STRIKE: అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మహీంద్రా' భళా.. ఏడు రెట్లు పెరిగిన లాభం.. ఆదాయం భారీగా జంప్!
    Mahindra and Mahindra Q1 results: జూన్ త్రైమాసికంలో ఏడు రెట్లు అధికంగా నికర లాభాన్ని నమోదు చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. రూ.2360 కోట్ల ఏకీకృత నికర లాభం గడించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.19171.91 కోట్ల నుంచి రూ.28412.38 కోట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నమ్మకం నిలబెట్టిన నలుగురు యోధులు.. 'పట్టు'దలతో పతకాలు
    Commonwealth games 2022: తమ మీద పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయాలనే పట్టుదలతో ఇద్దరు అగ్రశ్రేణి రెజ్లర్లు.. పతకాల వేట కొనసాగించాలనే దూకుడుతో ఉన్న మరో ఇద్దరు యువ రెజ్లర్లు.. కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగుపెట్టి సత్తాచాటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలుగు తెరకు 'కొత్తందం'.. గ్రాండ్​ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు
    కథ, కథనాల విషయంలో సంగతేమో కానీ.. కొత్త తారాగణాన్ని తెరపైకి తీసుకురావడంలో జోరు చూపిస్తుంటుంది మన చిత్రసీమ. ముఖ్యంగా కథానాయికల్ని! కొత్తగా ఉంటుందని అనిపిస్తే చాలు.. ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతుంటాయి సినీ వర్గాలు. ఈ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ కొత్త అందాలు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Aug 6, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.