ETV Bharat / business

వడ్డీరేట్లు పెరుగుతాయా?.. ఈఎంఐలు భారం కానున్నాయా?.. 8వ తేదీ ఏం జరగనుంది?

author img

By

Published : Jun 4, 2023, 6:19 PM IST

Updated : Jun 4, 2023, 6:32 PM IST

repo rate hike
RBI UPCOMING MPC Decisions

RBI INTEREST RATES: వడ్డీరేట్లు పెరుగుతాయా?.. ఈఎంఐలు భారం కానున్నాయా?.. ఇప్పుడిదే ఇదే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. జూన్​ 8వ తేదీన ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటన చేయనుంది. అయితే ఈసారి రెపోరేటును ఆర్​బీఐ స్థిరంగానే ఉంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం కూడా చెబుతున్నారు. అదేంటంటే?

RBI Interest Rate 2023 : ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ​ఇండియా ఈసారి కూడా రెపోరేటును స్థిరంగానే ఉంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్​ త్రైమాసికంలో రిటైల్​ ద్రవ్యోల్బణం దిగిరావడం, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలో రేట్లను పెంచడం వల్లే ద్రవ్యోల్బణం దిగొస్తోందని పేర్కొన్నారు.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కిమిటీ జూన్‌ 6-8 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను జూన్‌ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగింది.

వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యల్బణం (సీపీఐ) ఏప్రిల్​లో 18 నెలల కనిష్ఠ స్థాయి 4.7 శాతానికి తగ్గిన నేపథ్యంతో ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశమవుతోంది. మే నెలకు సంబంధించిన 'సీపీఐ'ని జూన్​ 12న ఆర్​బీఐ ప్రకటించనుంది. "ఏప్రిల్​లో ద్రవ్యోల్బణం 5 శాతం వరకు తగ్గింది. మే నెలలో ఇది మరికాస్త తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచే అవకాశం ఉంది." అని బ్యాంక్​ ఆఫ్​ బరోడా చీఫ్​ ఎకనామిస్ట్ మదన్​ సబ్నవీస్​ తెలిపారు.

డిపాజిట్లు పెరిగే అవకాశం!
"రూ.2000 వేల నోట్ల ఉపసంహరణ చేపట్టి నేపథ్యంలో బ్యాంక్​ డిపాజిట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకుల్లో లిక్విడిటీ పెరిగింది. దీనితోపాటు రుతుపవనాల పురోగతి, ఖరీఫ్​ పంటపై ఎల్​నినో చూపే దుష్ప్రభావాలను కూడా ఆర్​బీఐ సమీక్షిస్తుంది" అని మదన్​ సబ్నవీస్​ పేర్కొన్నారు.

రెపోరేటు తగ్గించే అవకాశం?
REPO RATE : ఆర్​బీఐ ఈ సంవత్సరం రెపోరేటును 25 నుంచి 50 బేసిస్​ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఇది అక్టోబర్​ తరువాత మాత్రమే జరిగే అవకాశం ఉందని మదన్​ సబ్నవీస్​ అన్నారు. 'సీపీఐ' ద్రవ్యోల్బణాన్ని అటుఇటుగా 2 శాతం మార్జిన్​తో 4 శాతంగా నిర్ధరించాలని ప్రభుత్వం ఆర్​బీఐని కోరిందని.. బ్యాంకర్లు కూడా ఇదే ఆశిస్తున్నారని ఆయన తెలిపారు.

"బ్యాంకర్లకు సంబంధించినంత వరకు ఆర్​బీఐ ఇప్పటికే రెపోరేటును 2.5 శాతం మేర అధికంగా నిర్దేశించింది. వాస్తవానికి హోల్​సేల్​, రిటైల్​ ద్రవ్యోల్బణం రెండూ కూడా మితంగానే ఉన్నాయి. అందువల్ల రెపోరేటును ఆర్​బీఐ మరింత పెంచకూడదని భావిస్తున్నాం"

- రజినీష్​ కర్నాటక్​, మేనేజింగ్​ డైరెక్టర్​, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

ఆర్​బీఐ చాలా అంశాలు చూస్తుంది
RBI MPC MEETING : బ్యాంకర్లు వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచాలని కోరుకుంటున్నప్పటికీ, ఆర్​బీఐ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం పోకడలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు సహా పలు అంశాలను ఆర్​బీఐ పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్​బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచితే, అది జీడీపీ వృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పీహెచ్​డీ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్ అండ్​ ఇండస్ట్రీ ప్రెసిడెంట్​ సాకేత్​ దాల్మియా అభిప్రాయపడ్డారు.

"ఆర్​బీఐ సమర్థవంతమైన చర్యలతో, ద్రవ్యోల్బణం 310 బేసిస్​ పాయింట్ల మేర తగ్గింది. ఈఆర్​పీఆర్​ (పాలసీ రేటు ప్రభావ నిష్పత్తి), ద్రవ్యోల్బణం తగ్గుదల 1.24 బేసిస్​ పాయింట్ల మేర తగ్గింది. ఇది అభినందనీయం."

- సాకేత్​ దాల్మియా, ప్రెసిడెంట్​, పీహెచ్​డీ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్ అండ్​ ఇండస్ట్రీ

ఈఎంఐ భారం తగ్గుతుందా?
ఆర్​బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రజలపై వడ్డీ భారం తగ్గుతుంది. నెలవారీ చెల్లించే 'ఈఎంఐ'లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక వేళ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచితే కనీసం వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉంటుంది.

Last Updated :Jun 4, 2023, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.