ETV Bharat / business

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Jul 7, 2022, 11:24 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

crypto currency rates in india
gold price today

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.740 తగ్గి.. ప్రస్తుతం రూ.52,460 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.220 తగ్గి రూ.58,350 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,460గా ఉంది. కిలో వెండి ధర రూ.58,350 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,460వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,350గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,350 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,350 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం 1,747 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.37 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
రూపాయి విలువ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ మరోసారి పతనమైంది. గురువారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 19 పైసలు కోల్పోయి.. 79.06కు చేరుకుంది.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం ఓ బిట్​కాయిన్ రూ.16,45,000వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.16,45,000
ఇథీరియంరూ.94,350
టెథర్రూ.81.10
బినాన్స్​ కాయిన్రూ.19,274
యూఎస్​డీ కాయిన్రూ.82.30

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 330 పాయింట్ల లాభంతో.. 54 వేల పాయింట్ల ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 102 పాయింట్లు ఎగబాకి.. 16,097 వద్ద కొనసాగుతోంది. టైటాన్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్ ట్విన్ షేర్లు, రిలయన్స్ నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.