స్టాక్ మార్కెట్లకు లాభాలు- కొత్త గరిష్ఠానికి నిఫ్టీ

author img

By

Published : Oct 12, 2021, 3:46 PM IST

stocks close with Profits

స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 149 పాయింట్లు పెరిగి 60,284 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 46 పాయింట్ల లాభంతో 18 వేల మార్క్​కు చేరువైంది.

స్టాక్ మార్కెట్లలో (Stock Market) మంగళవారం కూడా లాభాల జోరు కొనసాగింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 149 పాయింట్లు పెరిగి 60,284 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల లాభంతో తొలిసారి 17,992 వద్దకు చేరింది.

ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. మిడ్​ సెషన్ తర్వాత కాస్త తేరుకున్నాయి. ఆర్థిక, ఎఫ్​ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 60,331 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,885 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,009 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,864 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, బజాజ్ ఆటో, బజాజ ఫినాన్స్, ఎస్​బీఐ, నెస్లే ఇండియా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్​ సిమెంట్​, టీసీఎస్, సన్​ ఫార్మా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎస్​బీఐ ఆన్​లైన్​ సేవలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.