శని, ఆదివారాల్లో ఎస్​బీఐ ఆన్​లైన్​ సేవలకు అంతరాయం

author img

By

Published : Oct 8, 2021, 2:02 PM IST

SBI

శని, ఆది వారాల్లో కొన్ని గంటల పాటు ఎస్​బీఐ సేవలు నిలిచిపోనున్నాయి. అంతర్గత వ్యవస్థలో అప్​డేట్ చేస్తున్నందున సేవలకు అంతరాయం ఏర్పడుతుందని ఎస్​బీఐ ప్రకటించింది.

భారతీయ స్టేట్​ బ్యాంక్​(ఎస్​బీఐ) సేవలకు శని, ఆదివారాల్లో అంతరాయం కలగనుంది. అక్టోబర్​ 9న.. 00:20 గంటల నుంచి 2:20 గంటల వరకు (120 నిమిషాల పాట) సేవలు ఆగిపోనున్నాయి. అక్టోబర్​ 10 అర్ధ రాత్రి 11:20 నుంచి అక్టోబర్​ 11 ఉదయం 1:20 వరకు (120 నిమిషాలు) సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

బ్యాంకింగ్ అంతర్గత వ్యవస్థలో అప్​డేట్స్​, మెయింటెనెన్స్​ కారణంగా.. ఇంటర్​నెట్​ బ్యాంకింగ్​, యోనో, యోనో లైట్​, యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చని ఎస్​బీఐ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

ఈ సమయంలో లావాదేవీలు జరపకపోవడమే ఉత్తమమని ఖాతాదారులకు, కస్టమర్లకు సూచించింది ఎస్​బీఐ.

ఇదీ చదవండి: ఐఎంపీఎస్​తో ఇకపై రూ.5లక్షల వరకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.