Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Oct 20, 2021, 8:00 AM IST

PETROL DIESEL PRICES TODAY
పెరిగిన చమురు ధరలు ()

దేశంలో ఇంధన​ ధరల (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు((Petrol price hike)) మరోసారి పెరిగాయి. తాజాగా బుధవారం లీటర్‌ పెట్రోల్​పై 37 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.106.19కు చేరగా.. డీజిల్​ ధర రూ.94.93కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 37 పైసలు పెరిగి రూ.112.07కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 38 పైసలు పెరిగి రూ.102.85 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర రూ.106.73కి చేరింది. లీటర్​ డీజిల్​ ధర​ రూ.98గా ఉంది.

చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ (Chennai Diesel Price Today) ధర రూ.103.27 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.99.22గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 37పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ ధర రూ.110.46కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.103.56 కి చేరింది.

గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 37 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.112.48గా ఉంది. డీజిల్​ లీటర్​కు 38 పైసలు పెరిగి.. రూ.104.99 వద్ద ఉంది.

విజయవాడలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.112.48 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.99కి చేరింది.

ఇదీ చూడండి: ఆహార భద్రత సూచీలో భారత ర్యాంకు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.