ETV Bharat / business

అన్ని నెట్​వర్క్​లూ ఛార్జీలు పెంచాయ్.. మరి ఏది బెటర్?

author img

By

Published : Nov 29, 2021, 5:03 PM IST

టెలికాం సంస్థలన్నీ మూకుమ్మడిగా ఛార్జీలను పెంచేశాయి. డేటా వినియోగానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఇది పెద్ద షాకింగ్ వార్తే. అయితే, పెంచిన తర్వాత ఏ నెట్​వర్క్ టారిఫ్ రేట్లు ఎలా ఉన్నాయి? అందులో ఏది బెటర్?

TARIFF PLANS jio vi airtel
TARIFF PLANS jio vi airtel

టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్​టెల్(airtel recharge), ఐడియా, రిలయన్స్​ జియో..​ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచి.. యూజర్లకు భారీ షాకిచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​ల ధరలను 20-25 శాతం పెంచాయి.

తొలుత ఎయిర్​టెల్​ ప్రీపెయిడ్ రీఛార్జ్​ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలను నవంబరు 26 నుంచి అమలు చేస్తోంది. ఆ వెంటనే వొడాఫోన్ ​ఐడియా కూడా రీఛార్జ్​ ధరలను పెంచిన ధరలను నవంబరు 25 నుంచి అమలు చేస్తోంది. దేశంలో అతిపెద్ద టెలికాం రిలయన్స్​ జియో.. తానేమి తక్కువ కాదంటూ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియా బాటలో పయనించింది. పెంచిన ధరలను డిసెంబరు 1 నుంచి అమలు చేయనుంది. మొత్తంమీద, టెలికాం ప్రొవైడర్ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో 20 నుంచి 25 శాతం పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థ టారీఫ్​ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

TARIFF PLANS vi
వొడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ ప్లాన్​లు
TARIFF PLANS jio vi airtel
ఎయిర్​టెల్ కొత్త టారిఫ్ ప్లాన్లు
TARIFF PLANS jio
జియో కొత్త ప్లాన్లు

ఇదీ చదవండి: విదేశాలకు కొవాగ్జిన్​ ఎగుమతి ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.