విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు కలెక్టర్ సత్యనారయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానంలో పుస్తకాలు అందజేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తహెరా సుల్తానా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 లక్షల 80వేల పాఠ్య పుస్తకాల అవసరం ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరులోపు విద్యార్థులందరికీ..పుస్తకాలు అందేలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మొదట పట్టణప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని వివరించారు.
వరల్డ్ రెడ్క్రాస్ డే సందర్భంగా రక్తనిధి కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకలకు కలెక్టర్ సత్యనారయణ హాజరయ్యారు. రక్తదానంపై జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.
ఇవీ చదవండి...చిన్నారులపై పిచ్చి కుక్కల దాడి..ఒకరి పరిస్థితి విషమం