ETV Bharat / bharat

తిమింగలం వాంతితో దందా.. ఐదున్నర కోట్ల విలువైన అంబర్​గ్రీస్​ స్వాధీనం

author img

By

Published : Feb 9, 2023, 11:00 AM IST

కోట్ల విలువ చేసే అంబర్​గ్రీస్​ను (తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.ఐదున్నర కోట్ల విలువ చేసే అంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు.

Whale vomit gang arrested news
తిమింగలం వాంతి దందా ముఠా అరెస్టు

మహారాష్ట్ర కొల్హాపుర్​లో కోట్ల విలువ చేసే అంబర్​గ్రీస్​ను (తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదున్నర కోట్ల విలువచేసే అంబర్​గ్రీస్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
సాంగ్లీ పట్టణంలోని శామ్రావ్ నగర సమీపంలో అంబర్​గ్రీస్​ను విక్రయించేందుకు కొందరు వస్తున్నట్లు స్థానిక నేర పరిశోధన విభాగానికి సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లి సోదాలు చేయగా.. తెల్లటి పెట్టెలో ఎనిమిది పసుపు, గోధుమ రంగు దీర్ఘచతురస్త్రాకార వస్తువులు కనిపించాయి. అందులో ఐదున్నర కిలోల బరువున్న అంబర్​గ్రీస్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.ఐదు కోట్ల 71 లక్షలుంటుందని పోలీసుల అంచనా వేశారు.

Whale vomit gang arrested news
ఐదున్నర కోట్ల విలువైన అంబర్​గ్రీస్​ స్వాధీనం చేసుకున్నపోలీసులు

ఈ ఘటనలో పటేల్, అక్బర్ షేక్​లను అరెస్టు చేసినట్లు కొల్హాపుర్ రీజియన్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ ఫులారి తెలిపారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ అంబర్​గ్రీస్​కు డిమాండ్ ఉందని, అందుకే వీటిని రహస్యంగా తరలిస్తున్నట్లు సునీల్ చెప్పారు. అంబర్​గ్రీస్​ను మాల్వాన్​ నుంచి సాంగ్లీకి విక్రయానికి తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.