ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 14 మంది మృతి.. 50 మందికి గాయాలు

author img

By

Published : Feb 25, 2023, 8:03 AM IST

Updated : Feb 25, 2023, 9:11 AM IST

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. మరోఘటనలో రెండు లారీలు ఒకదానికి ఒకటి ఢీకొట్టగా.. ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

mp sidhi acciden
mp sidhi acciden

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి.. రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సిద్ది జిల్లాలోని రేవా-సత్నా సరిహద్దుల్లోని మోహనియా ప్రాంతంలో.. రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

సత్నాలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రసంగించిన ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి బస్సుల్లో వస్తున్నారు. అయితే ఆహార పొట్లాల కోసం రోడ్డు పక్కనే రెండు బస్సులను ఆపారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రక్కు టైర్​ పేలిపోవడం వల్ల అదుపుతప్పి.. రోడ్డుపై ఆగి ఉన్న బస్సులను ఢీకొట్టింది. దీంతో ఓ బస్సు అదుపుతప్పి గుంతలో పడగా.. మరో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మృతులకు అమిత్ షా సంతాపం తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటన స్థలాన్ని చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటంబాలకు రూ. 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. దీంతో పాటుగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారాన్ని ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ కుడా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

రెండు లారీలు ఢీ.. ఏడుగురు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికి ఒకటి ఢీకొట్టగా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాబ్​పుర్​ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బంగాల్​ వాసులుగా పోలీసులు గుర్తించారు.

కారు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
గుజరాత్​లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వడోదర ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం
శుక్రవారం రాత్రి దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంసీడీ ట్రక్కు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated :Feb 25, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.