పరువు హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు

author img

By

Published : Jul 12, 2021, 3:24 PM IST

Updated : Jul 12, 2021, 8:28 PM IST

supreme court

పరువు హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేశారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించి నిందితుడి బెయిల్​ను సుప్రీం రద్దు చేసింది.

పరువు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెడుతూ నిర్ణయం తీసుకుంది. బెయిల్​కు వ్యతిరేకంగా మృతుడి భార్య దాఖలు చేసిన ఫిర్యాదుకు ఈ మేరకు తీర్పునిచ్చింది. జిల్లా కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది.

రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి తన బావను 2017లో హత్య చేశాడు. తన చెల్లి.. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరు ఇంట్లోకి చొరబడి మహిళ భర్తను హత్య చేశారు. పాయింట్ బ్లాంక్​లో గన్ పెట్టి కాల్చారు. ఆ సమయంలో మహిళ ఆరు నెలల గర్భంతో ఉంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ముకేశ్ చౌదరి(మృతుడి బావ)పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, బెయిల్​ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ చౌదరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం నిందితుడి బెయిల్​ను రద్దు చేసింది.

ఇదీ చదవండి: భర్తను నరికి చంపిన అన్న- చెల్లెలి ఆత్మహత్య!

Last Updated :Jul 12, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.