సొంత స్టేషన్​లోనే సీన్​ రివర్స్​.. లాకప్​లో పోలీసులు.. 2 గంటల తర్వాత..

author img

By

Published : Sep 11, 2022, 1:43 PM IST

Nawada SP kept Five policemen in custody for two hours

ఆ ఐదుగురు.. పోలీసులు. నిందితులను లాకప్​లో పెట్టి విచారించడం వారి విధుల్లో ఒకటి. కానీ.. అనూహ్యంగా సీన్​ రివర్స్ అయింది. పోలీసులే నిందితుల్లా రెండు గంటలపాటు లాకప్​లో ఉన్నారు. అది కూడా.. సొంత స్టేషన్​లో. ఎందుకిలా? ఎక్కడ?

లాకప్​లో పోలీసుల సీసీటీవీ ఫుటేజ్​

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారని పోలీసుల్నే లాకప్​లో బంధించారు జిల్లా సూపరిండెంటెంట్. వారు పనిచేస్తున్న స్టేషన్​లోని సెల్​లోనే రెండు గంటలపాటు నిలబెట్టారు. బిహార్​ నవాదాలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్​పీ పనితీరును బిహార్​ పోలీస్​ అసోసియేషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

అసలేం జరిగింది : డ్యూటీలో భాగంగా బిహార్​లోని నవాదా పోలీస్​ స్టేషన్​కు గురువారం రాత్రి ఎస్​పీ గౌరవ్​ మంగళ వెళ్లారు. స్టేషన్​లో ఉన్న సిబ్బందిని డైరీ అడిగారు. అందులో వివరాలేవీ అప్డేట్​ చేసి​ లేవని ఆగ్రహించిన ఎస్​పీ.. స్టేషన్​లో ఉన్న సిబ్బందిపై అరిచారు. తర్వాత వారిని లాకప్​లో పెట్టి బంధించారు. సొంత స్టేషన్​లోనే నిందితుల్లా సెల్​లో ఉండాల్సి రావడం వల్ల.. నవాదా నగర పోలీస్​ స్టేషన్​ సిబ్బంది ఖంగు తిన్నారు. కానీ.. అలా చేయమని ఎస్​పీనే ఆదేశించినందున.. ఏమీ అనలేక మౌనంగానే ఉండిపోయారు. చివరకు రెండు గంటల తర్వాత బయటకు వచ్చారు. ఈ దృశ్యాలన్నీ పోలీస్ స్టేషన్​లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఎస్​పీ గౌరవ్​ మంగళ తీరుపై బిహార్ పోలీస్​ అసోసియేషన్​ మండిపడింది. ఈ విషయాన్నిఇంతటితో వదిలేయాలాని నవాదా స్టేషన్​ సిబ్బందిపై ఎస్​పీ ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయ్​ సింగ్​ ఆరోపించారు. స్టేషన్​లోని సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫుటేజ్​ను ఆధారంగా తీసుకుని గౌరవ్​ మంగళపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి: చెల్లి పెళ్లికి లీవ్ ఇవ్వలేదని ఆవేదన.. మతిస్తిమితం కోల్పోయి ఇంటికి దూరం.. మూడేళ్ల తర్వాత...

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.