ETV Bharat / bharat

ఠాణె హత్య కేసులో మరో ట్విస్ట్.. 'మృతదేహాన్ని ఏం చేయాలి?'.. గూగుల్​లో నిందితుడు సెర్చ్

author img

By

Published : Jun 10, 2023, 3:29 PM IST

Mira Road Killing Case : మహారాష్ట్ర ఠాణెలో జరిగిన అతికిరాతక హత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత.. అతడు చెప్పిన విషయాలన్నీ అవాస్తమని పోలీసులు నిర్ధరించారు. హత్యకు ముందు నిందితుడు మనోజ్.. సరస్వతి​ శరీర భాగాలను ఎలా పారవేయాలి, దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే వాటి కోసం గూగుల్ సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు.

mira-road-murder-case-mumbai-manoj-sane-google-search-for-body-dispose-and-taken-her-body-photo-for-memory
మీరా రోడ్డు హత్య కేసు మహారాష్ట్ర

Mira Road Killing Case : మహారాష్ట్ర ఠాణెలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భాగస్వామి సరస్వతిని చంపిన తరువాత నిందితుడు మనోజ్​.. ఆమె మృతదేహానికి ఫొటో తీశాడని పోలీసులు తెలిపారు. సరస్వతిని చంపే ముందు ఆమె శరీర భాగాలను ఎలా పారవేయాలి, దుర్వాసన రాకుండా ఏం చేయాలని తెలుసుకోవడం కోసం గూగుల్​లో సెర్చ్ చేశాడని వెల్లడించారు. వీడియోలు సైతం చూశాడని పేర్కొన్నారు. అదే విధంగా మనోజ్​ ఇచ్చిన ప్రాథమిక సమాచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు నిర్ధరించారు.

అరెస్ట్ తరువాత తాను, సరస్వతి అనాథలమని​ పోలీసులకు చెప్పాడు మనోజ్​. కానీ అదంతా అబద్ధమని పోలీసులు తేల్చారు. గురువారం ముగ్గురు మహిళలు.. తాము సరస్వతి సోదరిలమంటూ పోలీసులను ఆశ్రయించారు. తాము ఐదుగురు అక్కాచెల్లెళ్లమని.. అందరికంటే సరస్వతి చిన్నదని పోలీసులకు వివరించారు. దీంతో ఆ మహిళలు చెప్పిన విషయాలను ధ్రువీకరించేందుకు.. వారికి డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అనంతరం వారందరిని అక్కాచెల్లెళ్లుగా నిర్ధరించుకుని.. సరస్వతి మృతదేహాన్ని వారికి అప్పగించారు.

కాగా మనోజ్​కు సైతం ముంబయిలో బంధువులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. మనోజ్​కు హెచ్​ఐవీ ఉందా? లేదా? అన్న దానిపై మాత్రం పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే నిందితుడికి ఇంకా హెచ్​ఐవీ పరీక్షలు నిర్వహించనట్లు సమాచారం. తన భాగస్వామి సరస్వతి హత్యకు ముందు నిందితుడు గూగుల్​లో​ సెర్చ్​ చేశాడని పోలీసులు తెలిపారు. శరీర భాగాలను ఎలా పారవేయాలి.. వాసన రాకుండా ఏం చేయాలన్న దానిపై.. వీడియోలు కూడా చూశాడని వారు పేర్కొన్నారు. ఓ వెబ్​ సిరీస్​ చూసి మనోజ్​ ఈ తరహా ఘటనకు పాల్పడినట్లు వివరించారు. అనంతరం సరస్వతిని హత్యచేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్​లో ఉడికించిన తరువాత మూడు బకెట్​లలో కుక్కాడని పోలీసులు పేర్కొన్నారు.

హత్య ఘటన వివరాలు..
మృతురాలు సరస్వతి వైద్య (36), నిందితుడు మనోజ్ సహానీ (56) సహజీవనం చేస్తూ ఠాణెలోని మీరా రోడ్ అపార్ట్​మెంట్​లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగింటివారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్​మెంట్​కు వచ్చి పరిశీలించిన పోలీసులకు.. గదిలో మృతదేహం లభించింది. దీంతో సరస్వతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలు.. బకెట్లలో కనిపించాయని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని వారు అనుమానించారు.

Body parts boiled in cooker : సహానీ బెడ్​రూమ్​లో భారీ ప్లాస్టిక్ బ్యాగులు, రక్తపు మడుగులో ఉన్న చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్​తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్లు గుర్తించారు. ఇంకొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసినట్లు తెలిపారు. మహిళ వెంట్రుకలు, సగం కాలిన ఎముకలు, శరీర భాగాలు కిచెన్​ సింక్​లో, బకెట్లలో కనిపించాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.