ETV Bharat / bharat

బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...

author img

By

Published : Oct 19, 2021, 2:27 PM IST

బస్టాండ్​లో పార్క్ చేసిన ఓ బస్సుపై ఆ దొంగల కన్ను పడింది. పక్కా ప్లాన్​తో ఎవరూ లేని సమయం చూసి కొట్టేశారు. అదే బస్సులో పరిసర గ్రామాల్లో చక్కర్లు కొట్టారు. చివరకు ఏమైందంటే?

KSRTC bus stolen from the bus station in Tumkur
బస్సును కొట్టేసి పరారైన దొంగలు

కర్ణాటకలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బస్​ స్టేషన్​లో ఉన్న బస్సునే కొట్టేశారు.

వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లా గుబ్బి బస్టాండ్​లో పార్క్​ చేసి ఉన్న బస్సును దొంగిలించారు దుండగులు. ఆ బస్సుతోనే కునిగల్​ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టారు. బస్సులో డీజిల్​ మొత్తం అయిపోయాక.. జన్నెనహళ్లి గ్రామం వద్ద దానిని వదిలి పారిపోయారు.

KSRTC bus stolen from the bus station in Tumkur
బస్సును కొట్టేసి పరారైన దొంగలు

గుబ్బి బస్​ స్టేషన్​లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. బస్సు డ్రైవర్​, ఆపరేటర్​ నిర్లక్ష్యం కారణంగానే.. బస్సు చోరీకి గురైందని అధికారులు అంటున్నారు.

యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 100 కోట్ల ప్రయాణం.. ఇంకా సగం మిగిలే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.