ETV Bharat / bharat

చైనా దిగ్గజ సంస్థకు ఈడీ షాక్​.. రూ.5,551 కోట్లు సీజ్​

author img

By

Published : Apr 30, 2022, 4:25 PM IST

Enforcement Directorate Xiaomi: ప్రముఖ మొబైల్​ ఫోన్​ తయారీ సంస్థ షియోమీకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ షాక్​ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్​ చేసింది. షియోమీ గ్రూప్‌ సంస్థ సహా విదేశాల్లోని మూడు కంపెనీలకు ఆ సంస్థ భారత విభాగం రాయల్టీ ముసుగులో ఈ డబ్బును చెల్లించినట్లు ఈడీ పేర్కొంది.

Enforcement Directorate
Enforcement Directorate

Enforcement Directorate Xiaomi: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీకి భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. ఫెమా(విదేశీ మారక చట్టం) నిబంధనల ఉల్లంఘనల కింద షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5551.27కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ శనివారం వెల్లడించింది. చైనాకు చెందిన షియోమీ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా భారత్‌లో 2014 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే ఈ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది.

''ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షియోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేగాక, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసింది.'' అని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసు విచారణలో భాగంగానే షియోమీ ఇండియా గ్గోబల్​ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్​ను ఈడీ ఇటీవల ప్రశ్నించింది.

ఇదీ చూడండి : పాటియాలాలో టెన్షన్​ టెన్షన్​.. ఇంటర్నెట్ సేవలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.