ETV Bharat / bharat

భార్యాభర్తల మధ్య గొడవ.. మధ్యలో బాలుడు మృతి.. మతం మార్చుకోకుంటే చంపేస్తానని బెదిరింపు

author img

By

Published : Nov 3, 2022, 7:49 PM IST

child killed
చిన్నారి మృతి

భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ మూడేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, మతం మారి తనను పెళ్లి చేసుకోమని బెదిరింపులకు దిగాడు ఓ వ్యక్తి.

బిహార్​ భాగల్​పుర్​లో దారుణం జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం వల్ల మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం మాయాగంజ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు గల కారణాలను తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భాగల్​పుర్​కు చెందిన ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో వారు ఒకరిపై ఒకరు పదునైన కత్తితో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల బల్వీర్ సింగ్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడు. ఆ బాలుడితో పాటు నిందితులు, ఇద్దరు పిల్లలకు సైతం గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెళ్లి చేసుకోమని బెదిరింపులు..
ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో దారుణం జరిగింది. ఓ బాలికను మతం మార్చుకుని.. పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు ఓ వ్యక్తి. మతం మారి తనను పెళ్లి చేసుకోకపోతే బాధితురాలిని, ఆమె సోదరుడిని తల నరికి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనలో నిందితుడు షారుక్​ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుడు.. బాధితురాలికి ఫేస్​బుక్ ద్వారా​ పరిచయమయ్యాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవీ చదవండి: ఈడీ విచారణకు సీఎం డుమ్మా.. దమ్ముంటే అరెస్టు చేయండంటూ సవాల్

మహిళపై భర్త, ప్రియుడి యాసిడ్ దాడి.. చెల్లి గొంతుకోసి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.