ETV Bharat / bharat

వరదల్లో కొట్టుకుపోయిన బస్సు.. క్షణాల్లోనే...

author img

By

Published : Sep 28, 2021, 11:25 AM IST

Updated : Sep 28, 2021, 6:16 PM IST

భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు మహారాష్ట్రలో(maharashtra rains today) ఓ బస్సు కొట్టుకుపోయింది. నాందేడ్​ నుంచి నాగ్​పుర్​ వెళుతున్న సమయంలో యావత్​మాల్​ జిల్లాలో(yavatmal news today) ఈ ఘటన జరిగింది. బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరిని సురక్షితంగా కాపాడారు.

floods
వరదలు

మహారాష్ట్రలో(maharashtra rains today) భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యావత్​మాల్​(yavatmal news today) జిల్లాలో వరద ఉద్ధృతికి ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో ఆరుగురు ఉండగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. డ్రైవర్​, కండక్టర్​ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

floods
కొట్టుకుపోతున్న బస్సు

బస్సు.. నాందేడ్​ నుంచి నాగ్​పుర్ వెళ్తున్న సమయంలో దహాగోన్​ వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయిన డ్రైవర్​.. వంతెన దాటేందుకు యత్నించాడు. కానీ వరద వేగానికి బస్సు కొట్టుకుపోయింది. స్థానికుల సహాయంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

floods
బస్సులో చిక్కుకున్నవారిని కాపాడుతున్న స్థానికులు

అంతకుముందు.. బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

floods
కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదీ చూడండి:- నదిలో కొట్టుకుపోయిన ఏనుగులు- కాపాడేందుకు అధికారుల యత్నం

Last Updated : Sep 28, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.