ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

author img

By

Published : Apr 25, 2020, 7:04 PM IST

దేశంలో కొవిడ్​ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 779కి చేరింది. రాజస్థాన్​లో కొత్తగా 25 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 2 వేలు దాటింది. కర్ణాటకలో మరో 15 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

According to the latest figures from the Central Health Department .. Corona cases reached 24,942. Of these, 5,210 were recovered and 779 died.
కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

భారత్​లో కరోనా వేగం పుంజుకుంటోంది. రాష్ట్రాలన్నీ లాక్​డౌన్​ చర్యలు చేపట్టినప్పటికీ.. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24,942 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది.

According to the latest figures from the Central Health Department .. Corona cases reached 24,942. Of these, 5,210 were recovered and 779 died.
దేశంలో కరోనా కేసు వివరాలు

రాష్ట్రాల్లో ప్రభావం ఇలా...

  • మధ్యప్రదేశ్​ ఇండోర్​లో మరో ఇద్దరు కరోనాతో మరణించారు. నగరంలో మెత్తం మృతుల సంఖ్య 57కు చేరింది. గత 24 గంటల్లో 56 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 1,085కు పెరిగింది.
  • రాజస్థాన్​లో శనివారం 25 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,059 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. 32 మంది వైరస్​తో మరణించారు.
  • కర్ణాటక బెంగళూరులో కొత్తగా 15 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 500 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
  • కోల్​కతాలో శిశువుకు జన్మనిచ్చిన ఓ మహిళకు కొవిడ్​ పాజిటివ్​ తేలింది. వెంటనే ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్​లో ఉంచి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు. బంగాల్​లో మొత్తం 18 మంది వైరస్​కు బలయ్యారు. 485 మందికి ఈ మహమ్మారి సోకింది.
  • జమ్మకశ్మీర్​లో మరొకరు వైరస్​కు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు వైరస్​కు బలయ్యారు. మరో 40 మందికి కరోనా​ సోకగా.. మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 494కు చేరింది.
  • బిహార్​లో కొత్తగా ఐదుగురు మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 228కి పెరిగింది.
  • పంజాబ్​లోని ఆరు జిల్లాల్లో వైరస్​ బాధితులంతా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.