ETV Bharat / bharat

గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన సీపీ

author img

By

Published : Mar 14, 2023, 3:51 PM IST

Updated : Mar 14, 2023, 4:24 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్ విషయంపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. తమ దృష్టికి రాలేదని విక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.
tspsc exam paper leak case
tspsc exam paper leak case

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ లీకేజీపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోందని విక్రమ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే గ్రూప్ 1 పేపర్ లీకేజీ విషయం తమ దృష్టికి రాలేదని విక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

''మాకు ఉన్న సమాచారం ప్రకారం గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన విషయం ఇంకా స్పష్టత లేదు. అలాంటిది మా దృష్టికి రాలేదు. కేసు దర్యాప్తులో ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్ అయిందని ఎలంటి ఫిర్యాదు అందలేదు. కేవలం మాకు ఉన్న సమాచారం ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ అయింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రవీణ్‌తో పాటు 9 మంది అరెస్ట్ చేసాము.'' - విక్రమ్ సింగ్, నగర శాంతి భద్రతల అదనపు సీపీ

ఇక ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్‌సీ వద్ద విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో టీఎస్‌పీఎస్సీ బోర్డు ధ్వంసం అయింది. దీనితో రంగంలోకి పోలీసులు దిగారు. టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రతను అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ పర్యవేక్షించారు. టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరించారు. వరుస ఆందోళనల దృష్ట్యా అదనపు బలగాలు మోహరించినట్లు తెలుస్తోంది. 9 మంది నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షల తర్వాత పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ గ్రూప్ 1 కూడా రాయడంతో అనుమానాలు తలెత్తాయి. అతనికి 150 మార్కులకు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ ప్రవీణ్ అర్హత సాధించలేదు. బుక్‌ లెట్ నంబర్ కింద మార్కింగ్ తప్పుగా చేయడంతో... ప్రవీణ్ అర్హత సాధించలేదు. ఇక ఈ ప్రవీణ్ ఫోన్‌లో ఏడుగురు మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్​ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన సీపీ

ఇవీ చూడండి..

TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల న్యూడ్ వీడియోలు

TSPSC లీకేజీ వ్యవహారం.. AE పేపర్ ఒక్కటే కాదు.. అవి కూడా లీక్?

Last Updated :Mar 14, 2023, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.