విద్యుత్​ సైకిల్ రూపొందించిన పదో తరగతి విద్యార్థి.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 90 కి.మీ ప్రయాణం

author img

By

Published : Feb 4, 2023, 2:33 PM IST

Etv BharatA 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours
A 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours ()

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు.. వినూత్న ఆవిష్కరణతో ఆకట్టుకుంటున్నాడు. నాలుగు గంటలు ఛార్జ్​ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్​ సైకిల్​ను రూపొందించి అబ్బురపరుసున్నాడు. ఓ సారి ఆ ఎలక్ట్రిక్​ సైకిల్​ గురించి తెలుసుకుందాం రండి.

విద్యుత్​ సైకిల్ రూపొందించిన పదో తరగతి విద్యార్థి

హైపర్​ యాక్టివ్​ డిజార్డర్​తో బాధపడుతున్న కేరళకు చెందిన ఈ బాలుడు.. విద్యుత్​ ఛార్జింగ్​తో నడిచే సైకిల్​ను తయారు చేశాడు. కేవలం నాలుగు గంటలు ఛార్జ్​ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని చెబుతున్నాడు. పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్​ వస్తువులంటే చాలా ఆసక్తి. ఏ చిన్న మెషిన్​ను చూసినా దాన్ని ఒక పట్టు పట్టేవాడు. పలు విధాలుగా దాన్ని వాడుకునేవాడు. ఆ ఆసక్తితోనే ఇప్పుడు.. విద్యుత్​ సైకిల్​ను రూపొందించాడు.

Sayanth, A 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours
సయంత్​

కాలికట్​ జిల్లాలోని కోయిలాండికి చెందిన శ్రీధరన్​, గీతల కుమారుడైన సయంత్​.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. అతడు.. హైపర్​యాక్టివ్ డిజార్డర్​తో బాధపడుతున్నాడు. కొన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వెంటనే ఏకాగ్రత కోల్పోవడం ఈ వ్యాధి లక్షణం. అయినప్పటికీ.. తన నైపుణ్యంతో ఆశ్యర్యపరుస్తున్నాడు సయంత్. స్థానికంగా జరిగిన జిల్లా సైన్స్​ ఫెయిర్​లో రెండో స్థానాన్ని సంపాదించాడు.

Sayanth, A 15-year-old suffering from hyperactivity disorder from Kerala Built an electric bicycle. It runs for 90 kilometres after charging the battery for 4 hours
విద్యుత్​ సైకిల్​తో సయంత్​

"మా బంధువుల దగ్గర ఎలక్ట్రికల్ వర్క్​ నేర్చుకున్నాను. మా నాన్న ప్రోత్సాహంతో దీన్ని స్టార్ట్​ చేశాను. నేను తయారు చేసిన విద్యుత్​ సైకిల్​ నాలుగు గంటలు ఛార్జ్​ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హ్యాండిల్ దగ్గర బ్యాటరీ ఇండికేటర్​ ఉంటుంది. అది ఛార్జింగ్​ అయిపోతే చెబుతుంది. ఇప్పుడు నేను రూపొందించిన సైకిల్​కు సుమారు రూ.25 వేలు ఖర్చు అవుతోంది. బేసిక్​గా సైకిల్​ తయారు చేయాలంటే పది నుంచి పదిహేను వేలు వరకు ఖర్చు అవుతుంది."
-సయంత్​, విద్యుత్​ సైకిల్​ రూపకర్త

"నా కుమారుడికి చిన్నప్పుటి నుంచి విద్యుత్ మెషిన్లు అంటే ఆసక్తి. ఏ చిన్న మెషిన్​ను చూసినా.. దాన్ని కాస్త మార్చి కొత్తగా తయారు చేస్తాడు. వాడికి కావాల్సిన ఏ పరికరాలు అయినా తెచ్చి ఇస్తాను. సయంత్​ తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడతాను."
-సయంత్​ తండ్రి

తాను రెండో తరగతి నుంచి సైకిల్​ తొక్కేవాడినని.. అప్పుడే ఎలక్ట్రిక్​ సైకిల్​ గురించి ఆలోచించానని సయంత్ చెప్పాడు. తాను తయారు చేసిన సైకిల్​కు బీఎల్​డీసీ మోటర్​, బైక్​ చైన్​ అమర్చినట్లు చెప్పాడు. పదో తరగతి పూరయ్యాక పాలిటెక్నిక్​ చదవాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.