ETV Bharat / bharat

మూడు నెలల పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య!

author img

By

Published : Nov 4, 2021, 1:00 PM IST

మూడు నెలల పసికందుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు (family feud commits suicide) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక గడగ్ జిల్లాలో జరిగింది.

family feud commits suicide
సుధామల్లప్ప దంపతులు

కర్ణాటక గడగ్ జిల్లాలో దారుణం జరిగింది. మూడు నెలల పసికందుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (family feud commits suicide) ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులు ఊరి చివర ఉన్న తమ ఫామ్​హౌస్​లో ఈ చర్యకు పాల్పడ్డారు.

family feud commits suicide
సుధామల్లప్ప దంపతులు

నాగేంద్రగడ గ్రామంలో మల్లప్ప(30), ఆయన భార్య సుధా గడాడ్(24)​తో కలిసి నివసిస్తున్నాడు. వీరిరువురు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప (రూపశ్రీ) కూడా ఉంది. వీరందరూ ఊరి చివర ఉన్న తమ ఫామ్​ హౌస్​లో ఉరి వేసుకుని (family commits suicide together) మృతి చెందారు. మల్లప్ప హాల్​లో ఉరి వేసుకోగా.. సుధ, కూతురు బెడ్​రూమ్​లో శవాలుగా కనిపించారు.

కుటుంబ కలహాల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.​ ముందు భార్యకు, పసిబిడ్డకు మల్లప్ప ఉరి వేసి, వారు చనిపోయాక తను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:ఏడాది వయసు చిన్నారిని అపహరించి.. లైంగిక వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.