నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం - సచివాలయ ఉద్యోగిపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 7:57 PM IST

thumbnail

YCP Leader Attack on Sachivalayam Employee in Nellore District : సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నాయకుడు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె సచివాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం ఆదినారాయణ అనే ఉద్యోగి తిమ్మారెడ్డి పెల్లె సచివాలయంలో డిజిటర్ అసిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ సచివాలయం వద్దకు వచ్చి నిబంధనలను ఉల్లంఘించిన ఆన్​ లైన్​లో లేని పట్టాలను రిజిస్టర్ చేయాలని ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చాడు. అలా చేయడం సరికాదని ఉద్యోగి బదులిచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన సుధాకర్ అక్కడి సచివాలయ ఉద్యోగులందరిని ఉద్దేశించి 'మీరేమైనా జంతువులకు పుట్టారా' అంటూ దుర్భాషలాడాడు. అనంతరం డిజిటర్ అసిస్టెంట్​పై దాడికి పాల్పడ్డాడు. 

ఈ తతంగం అంతా ఆ పార్టీ మండల స్థాయి నాయకుల సమక్షంలోనే జరిగిందన్నారు. సచివాలయ ఉద్యోగిపై దాడిని ఖండిస్తూ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు ప్రభుదాసు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తాము ప్రభుత్వానికి అనుకూలంగానే పనులు చేస్తున్నప్పటికీ తమపై అధికార పార్టీ నాయకుల దాడులు చేయటం దారుణమన్నారు. ఒత్తిళ్లు, దాడులు చేస్తుంటే తాము ఎలా పని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.