యాదాద్రి పాతగుట్ట ఆలయంలో ఘనంగా తిరుమంజనం
Published : Feb 17, 2024, 3:58 PM IST
Adhyayanotsavam celebrations In Yadadri : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ అలయమైన పాతగుట్ట నరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 15వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి పురప్పాట్టు సేవ, తిరుమంజనము నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధనం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్త్రోకంగా పాశురాలను పఠించారు.
Yadadri Laxmi narasimha Temple : ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం వేద మంత్రాలు, మేళ, తాళాలు, వాయిద్యాల నడుమ స్వామి వారికి 3వ రోజు అధ్యయనోత్సవాలు కనుల విందుగా నిర్వహించారు. స్వామి అమ్మ వార్లను రంగు రంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు సాయంత్రం పురప్పాటు సేవా ప్రబంధ సేవకాలము జరుపనున్నారు.