వైఎస్సార్సీపీ నేతల దోపిడీలతో ప్రజలు విసిగిపోయారు - కూటమి గెలుపు ఖాయం: శ్రీభరత్ - MP Candidate Sri Bharath Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 1:11 PM IST

Updated : May 5, 2024, 1:16 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ నేతల దోపిడీలతో ప్రజలు విసిగిపోయారు- కూటమి అభ్యర్థులకు గెలుపును పట్టం కడతారు: శ్రీభరత్ (ETV Bharat)

Visakha TDP MP Candidate Sri Bharath Interview: విశాఖలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల దోపిడీలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ విమర్శించారు. విశాఖలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న గీతం విద్యా సంస్థల ఛైర్మన్ గత ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో పరాజయం చూసినా ప్రస్తుతం ఓటర్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఖరిపట్ల ఉన్న వ్యతిరేకత కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని అన్నారు. ఓటర్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొవిడ్ సమయంలో సేవలందించిన గీతం విద్యాసంస్థలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసకర ధోరణితో భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రశాంత విశాఖకు దోహదం చేసే కూటమి అభ్యర్థులకు ప్రజలు ఈసారి గెలుపును పట్టం కడతారన్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపుజెండా ఎగరవేస్తానంటున్న విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్​తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.

"విశాఖలో వైఎస్సార్సీపీ నేతల దోపిడీలతో ప్రజలు విసిగిపోయారు. ఓటర్లలో జగన్ ప్రభుత్వ వైఖరిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓటర్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అభ్యర్ధుల గెలుపునకు ప్రజలు పట్టం కడతారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపుజెండా ఎగరవేస్తా." - శ్రీభరత్, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి

Last Updated : May 5, 2024, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.