ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ ప్రచారాలు - కూటమితోనే అభివృద్ది సాధ్యమని వెల్లడి - TDP Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 1:37 PM IST

thumbnail

TDP leaders Election Campaign: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో దూకుడు పెంచారు. సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లతో మమేకమవుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు.

Kinjarapu Achchennaidu Election Campaign: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్‌సిక్స్‌ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. గ్రామాల అభివృద్ధి తన బాధ్యత అని, కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.

Payyavula Keshav Election Campaign: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయంతోనే సాధ్యమని ఆ పార్టీ యువ నాయకులు పయ్యావుల విక్రమసింహ పేర్కొన్నారు. ఉరవకొండ మండలం నెరమెట్ల, నింబగల్లు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.