మోకాళ్లపై తిరుమల కొండెక్కిన టీడీపీ అభిమాని - ఎన్నికల్లో గెలవాలని స్వామి వారికి మొక్కులు - TDP Follower in Tirumala

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 5:47 PM IST

thumbnail

TDP Follower in Tirumala : రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తిరుపతికి చెందిన శ్రీనివాసులు మోకాళ్ల పై నడుచుకుంటూ తిరుమలకు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అలిపిరి మెట్ల మార్గం వద్దకు వెళ్లి శ్రీనివాసుకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వీరాభిమానులను సంపాదించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరి ఆశీస్సులతో తన తండ్రి భారీ మెజారిటీతో  గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్​ ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని మండిపడ్డారు. ఇకనైనా ప్రజలందరూ అభివృద్ది చేసేవారిని గెలిపించాలని వినీల్ కోరారు. 

రాష్ట్ర అభివృద్ధి విజన్ కలిగిన చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేస్తూ వారికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని భక్తుడు శ్రీనివాసులు తెలిపారు. అలా జరగకూడదనే ముందుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుని మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమలకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.