వివేకా హత్యకు ఆయన ప్రత్యర్థులే కుట్ర చేసి ఉండాలి - సునీత కామెంట్స్​కు సజ్జల రిప్లై

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:04 PM IST

thumbnail

Sajjala Ramakrishna Reddy on YS Sunitha Comments: ఎన్నికలు దగ్గరకు వస్తున్నందునే చంద్రబాబు సునీతను ఉసిగొల్పి దిల్లీలో మీడియా సమావేశం పెట్టించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివేకాను హత్య చేసేందుకు అప్పటి ఆయన ప్రత్యర్ధులు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలే కుట్ర చేసి ఉండాలని సజ్జల ఆక్షేపించారు. 

సునీత ఇప్పుడు జగన్​పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీకి ఓటు వేయొద్దని సునీత నినాదం ఇవ్వటం ఏమిటని సజ్జల ప్రశ్నించారు. దీన్నిబట్టే ఆమె ప్రతిపక్షాలతో కలిసిపోయినట్టు స్పష్టమవుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే హత్య జరిగితే విచారణ అప్పుడే ఎందుకు ముగించలేకపోయారని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో వారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయన్నారు. అప్రూవర్​గా మారిన హంతకుడినే అక్కున చేర్చుకున్నారని ఆరోపించారు. 

మరోవైపు టీడీపీ జనసేన సభల్లో బూతులు తప్ప ఏముందని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలా పనిచేస్తోందని ఆరోపించారు. అసలు ఆయన పార్టీకి సీరియస్​నెస్ లేదని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని అన్నారు. తాడేపల్లిగూడెం సభలో హూంకరింపులు, అరుపులు ఏమిటని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.