రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' కార్యక్రమంలో గవర్నర్​ తేనేటి విందు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 9:51 PM IST

thumbnail

Raj Bhavan At Home: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' లో అతిథులకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్​ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు, రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్​గా  జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. గత సంవత్సరం ఫిబ్రవరిలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' : ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులకు రాష్ట్ర గవర్నర్​ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌ 'ఎట్‌ హోమ్‌' అని పిలుస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఒకేసారి హాజరవుతారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.