గుంటూరులో పట్టపగలు రియల్టర్ మర్డర్- బంధువుల పనే అంటున్న కుటుంబసభ్యులు - guntur murder

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 3:36 PM IST

Updated : May 22, 2024, 3:59 PM IST

thumbnail
గుంటూరులో పట్టపగలు రియల్టర్ మర్డర్- బంధువుల పనే అంటున్న కుటుంబసభ్యులు (ETV Bharat)

Young Man Brutally Murdered in Guntur: గుంటూరులో పట్టపగలే ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. సంజీవయ్య నగర్​లోని రెడ్డిపాలెం రోడ్డులోని శ్రీనివాస చికెన్ సెంటర్ వద్ద కంచర్ల దేవదానం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులు, మారణాయుధాలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో బంధువులే దేవాదానంను హత్యచేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా తమ బంధువుల నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని తెలిపారు. 

మృతుడి మీద గతంలో స్థానిక ఆరండల్ పేట పోలీస్ స్టేషన్​లో రౌడీ షీటర్ నమోదై ఉంది. కొంతకాలంగా దేవదానం గుంటూరులో కాకుండా వేరే చోట నివాసం ఉంటూ, ఎన్నికల కోసం నగరానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Last Updated : May 22, 2024, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.