జాతీయ రహదారిపై కారు పల్టీ- టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ సేఫ్ - NMD Farooq car accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 7:32 PM IST

thumbnail

Nandyala TDP MLA Candidate NMD Farooq Car Accident : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూఖ్ కారుకు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఎన్ఎండి ఫరూక్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఎన్ఎండి ఫరూఖ్ ఈరోజు మధ్యాహ్నం నంద్యాల నుంచి హైదరాబాద్​కు కారులో బయలుదేరారు. సరిగ్గా తుమ్మరాజు పల్లె సమీపంలోకి రాగానే ఫరూక్ కారుకు గేదెలు అడ్డు వచ్చాయి. ఒక్కసారిగా రహదారిపైకి బర్రెలు దూసుకు రావడంతో వేగంగా వెళుతున్నకారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే అభర్థి గౌరీ చరిత ప్రమాద స్థలానికి చేరుకుని ఫరూఖ్​ను పరామర్శించారు. తరువాత ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంతో వాహనం ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.