హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు - అధికారులపై ఎంఐఎం నేతల ఫైర్

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 7:54 PM IST

thumbnail

MIM Stop Demolition of Encroachments : నగరంలో ఆక్రమణదారులపై జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు దృష్టిసారించారు. ఇవాళ గుడి మల్కాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు కలిసి ఆక్రమణలు తొలగించే పనిలో పడ్డారు. తొలగింపులు చేపట్టిన ప్రాంతానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు వచ్చి హల్‌చల్‌ చేశారు. నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మోయినుద్దీన్‌లు ఆక్రమణలను తొలగిస్తున్న నగరపాలక అధికారులపై మండిపడ్డారు. 

GHMC Focus on Encroachments : పేదవారి వ్యాపారాలను అలా ఎలా తొలగిస్తారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు దుకాణాదారులంతా స్థలాన్ని ఆక్రమించలేదని, రోడ్లపైన వ్యాపారం చేయడం లేదని తెలిపారు. అకస్మాత్తుగా తొలగింపులతో వారి కుటుంబాలన్ని రోడ్డున పడుతాయన్నారు. తొలగించిన దుకాణాలకు చెందిన వ్యాపారులకు, మళ్లీ వ్యాపారం చేసుకునేలా అధికారులు స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నగరంలో రోజురోజుకూ  ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. రోడ్ల పక్కనే దుకాణాలు నెలకొల్పడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈనేపథ్యంలో ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.