ఇఫ్తార్​ విందుకు హాజరైన కేటీఆర్​ - రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదర భావంతో ఫరిఢవిల్లాలని ఆకాంక్ష - KTR Attends Iftar Dinner

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 8:03 PM IST

thumbnail

KTR Attends Iftar Dinner at Banjara Hills : తెలంగాణలో హిందూ ముస్లిం సోదర భావంతో ఫరిఢవిల్లాలని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్​ ఆకాంక్షించారు. బంజారాహిల్స్​లో ఇఫ్తార్​ విందుకు హుజురాబాద్​ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్​ కుమార్​ యాదవ్​ కూడా విందులో పాల్గొన్నారు. విందులో పాల్గొన్న కేటీఆర్​ ముస్లిం సోదరులకు ఫలాలు తినిపించి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

వారందరితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇస్లాం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే రంజాన్​ మాసం, వారికి శుభం కలిగించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ రంజాన్​ పండుగ అన్ని విజయాలను తీసుకురావాలని కోరారు. అనంతరం యువకులతో కలిసి కేటీఆర్​ సరదాగా సెల్ఫీలు దిగారు. యువకులతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్​ రాజ్యసభ సభ్యులు అనిల్​ కుమార్​ యాదవ్​తో పాడి కౌశిక్​ రెడ్డి కాసేపు ముచ్చటించి ఆలింగనం చేసుకున్నారు. వారు ఇస్లాం సోదరులకు కర్జూర ఫలాలు తినిపించారు. వారంతా కలిసి విందు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.