LIVE: పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ర్యాలీ - ప్రత్యక్షప్రసారం - Janasena Chief Pawan Kalyan Rally

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 10:55 AM IST

Updated : Apr 29, 2024, 12:38 PM IST

thumbnail

Janasena Chief Pawan Kalyan Rally Live: రాష్ట్రప్రజల కోసం తానొక కూలీలా పని చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమనని ఎద్దేవా చేశారు. యువతకు దిశానిర్దేశం చేసి వారిలో ఉన్న శక్తిని బయటకు తీస్తామని హామీ ఇచ్చారు. సగటు మనిషి గొంతును అసెంబ్లీలో వినిపిస్తానని ప్రజలకు పవన్‌ భరోసానిచ్చారు. రోడ్లు బాగు చేసి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. పోలవరం కాల్వల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు వందల ఎకరాల్లో చెరువులు కబ్జా చేశారన్న పవన్‌ కొండను కూడా మిగలకుండా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా నేడు పిఠాపురం నియోజకవర్గం రోడ్‌షోలో పవన్ పాల్గొన్నారు. ఈ ఉదయం చందుర్తి కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 29, 2024, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.