150 అడుగుల జాతీయ పతాకం - ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 1:49 PM IST

thumbnail

Governor Justice Abdul Nazir will Unveil the National Flag Stupa in Vijayawada : జగ్గయ్యపేటలో జాతీయ పతాక స్తూపాన్ని రాష్ట్ర గవర్నర్​ జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ ఆవిష్కరించారు. 150 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ జెండాను ఒకటిన్నర ఎకరంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. నగరంలోని 31వ వార్డు విష్ణుప్రియనగర్‌లో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆవిష్కరణ ప్రాంగణాన్ని జాతీయ జెండాతో అలకరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలకు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.  

జగ్గయ్యపేటలో జాతీయ పతాక స్తూప ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ విప్​ సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఈ జాతీయ చిహ్నాన్ని చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పార్కు నిర్మాణం, సుందరీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట ప్రాంతానికి స్వాతంత్య్ర సమరంలో ఉన్న ప్రత్యేకతను కూడా గవర్నర్​కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.