సీఎం జగన్​కు జనం కరవు -​ వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 3:17 PM IST

thumbnail

CM Jagan Election Campaign East Godavari in AP : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్రకు జనం లేక వెలవెలబోతోంది. ఇవాళ సీఎం జగన్​ తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇందుకు ప్రజల నుంచి స్పందన కరవైంది. సీఎం కాన్వాయ్​ రోడ్డుపై వెళ్తున్నా స్థానికులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అరకొరగా తరలి వచ్చిన కార్యకర్తలతోనే వైసీపీ నేతలు కార్యక్రమాన్ని నెట్టుకొచ్చారు.

Peravali East Godavari : సీఎం జగన్​ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్​ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్​ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్​ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.