సీఎం జగన్కు జనం కరవు - వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 3:17 PM IST
CM Jagan Election Campaign East Godavari in AP : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్రకు జనం లేక వెలవెలబోతోంది. ఇవాళ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇందుకు ప్రజల నుంచి స్పందన కరవైంది. సీఎం కాన్వాయ్ రోడ్డుపై వెళ్తున్నా స్థానికులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అరకొరగా తరలి వచ్చిన కార్యకర్తలతోనే వైసీపీ నేతలు కార్యక్రమాన్ని నెట్టుకొచ్చారు.
Peravali East Godavari : సీఎం జగన్ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.