LIVE : సీఈవో వికాస్‌రాజ్‌ మీడియా సమావేశం - CEO VIKASH RAJ Live on Elections

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 3:04 PM IST

Updated : May 11, 2024, 3:58 PM IST

thumbnail

CEO Vikas Raj Press Meet Live From Telangana State EC Office : లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవేచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ పూర్తి కానుందని చెబుతున్నారు. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికాస్‌రాజ్ పాల్గొని మాట్లాడుతున్నారు. ఇవాళ్టితో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో తదుపరి నియమాలను తెలియజేస్తున్నారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా మెలగాలని తెలుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మరికొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలు వరకు ప్రచారం జరుగుతుందని తెలియజేస్తున్నారు. 

Last Updated : May 11, 2024, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.