పేలిన బస్సు టైర్- 8 అడుగులు గాల్లోకి ఎరిగిపడి డ్రైవర్ మృతి

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 8:26 AM IST

thumbnail

Bus Tire Burst In Ajmer : టైర్ పేలి ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్​మేర్ జిల్లాలో జరిగింది. రాజ్​మాడీ ట్రావెల్ బస్సు సూరత్​ నుంచి వస్తుండగా టైర్ పంచర్ అయింది. డ్రైవర్ పర్బత్​సర్​ రోడ్​లోని గుజరాతీ హోటర్ దగ్గర పంచర్​ వేసేందుకు బస్సును ఆపాడు. గాలి నింపుతుండగా టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో డ్రైవర్ 8 అడుగుల మేర గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడు సీకార్ ప్రాంతానికి చెందిన జోదూరామ్​గా(38) పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రూపన్​గఢ్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. 

కారు టైర్​ పేలి 8మంది సజీవదహనం
ఇటీవలే ఉత్తర్​ప్రదేశ్ బరేలీలో డంపర్​ను ఓ కారు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. బహేడీ ప్రాంతానికి చెందిన కొందరు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బరేలీ- నైనీతాల్​ రహదారిపై వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.