సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన చిరు వ్యాపారులు - పరిష్కరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ - BRS MLA Talasani in secunderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 12:54 PM IST

thumbnail

BRS MLA Talasani on traffic Problems in Secunderabad : సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పరిధిలోని పాలికా బజార్​లో చిరు వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను సజావుగా కొనసాగించుకోవచ్చని మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. తమ వ్యాపార సముదాయాలను తీసివేయాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తలసాని దృష్టికి రావడంతో ఆయన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్​ పోలీసులు, వ్యాపారస్తులతో మాట్లాడి, ట్రాఫిక్​ సమస్య ఉత్పన్నం కాకుండా చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

వ్యాపారస్తులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సాయంత్రం వేళల్లో స్టేషన్​ పరిసర ప్రాంతాల్లో రద్దీ ఉండటంతో పాటు ఫుట్​పాత్​ల ఎదురుగా దుకాణాలు పెట్టవద్దని ఆయన వ్యాపారులకు సూచించారు. ట్రాఫిక్​ పోలీసులకు సహకరిస్తూ వ్యాపారం చేసుకోవాలని తలసాని తెలిపారు. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘిస్తే వారు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అందుకు వారి సూచనల మేరకు సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.