సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన చిరు వ్యాపారులు - పరిష్కరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ - BRS MLA Talasani in secunderabad
Published : Apr 1, 2024, 12:54 PM IST
BRS MLA Talasani on traffic Problems in Secunderabad : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని పాలికా బజార్లో చిరు వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను సజావుగా కొనసాగించుకోవచ్చని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ వ్యాపార సముదాయాలను తీసివేయాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తలసాని దృష్టికి రావడంతో ఆయన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు, వ్యాపారస్తులతో మాట్లాడి, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వ్యాపారస్తులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సాయంత్రం వేళల్లో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీ ఉండటంతో పాటు ఫుట్పాత్ల ఎదురుగా దుకాణాలు పెట్టవద్దని ఆయన వ్యాపారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ వ్యాపారం చేసుకోవాలని తలసాని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వారు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అందుకు వారి సూచనల మేరకు సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.