ETV Bharat / state

అన్నారం బ్యారేజీలో మళ్లీ సీపేజీలు - దిగువకు మళ్లీ నీటి విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 8:41 PM IST

seapages in Annaram Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీలోని నీటిని అధికారులు మరోసారి ఖాళీ చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీపేజీలను గుర్తించడంలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం మరమ్మతులు చేపట్టనున్నారు.

Annaram Saraswati Barrage Leakage
seapages in Annaram Barrage

అన్నారం బ్యారేజీలో మళ్లీ సీపేజీలు- నీరు దిగువకు విడుదల

seapages in Annaram Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో సీపేజీలు కలవరపెడుతున్నాయి. మళ్లీ డ్యాం దిగువన నీటిబుంగలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు దిద్ధుబాటు చర్యలు చేపట్టారు. మరమ్మతుల కోసం బ్యారేజీలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గతంలో అన్నారం బ్యారేజీలో సీపేజీ, బుంగలు, లీకేజీ సమస్యలు రావడంతో, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ అదే సమస్య ఉత్పన్నం కావడంతో బ్యారేజీలోని నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం బ్యారేజీలో నిల్వ ఉన్న రెండు టీఎంసీలను 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

Annaram Saraswati Barrage Leakage : గతేడాది నవంబర్‌లో అన్నారం బ్యారేజీ 38, 28 పియర్‌ల వద్ద సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడే అప్రమత్తమైన అధికారులు రాళ్లు, ఇసుక సంచులతో తాత్కాలిక మరమ్మతు చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటికి పోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్నారం బ్యారేజీని పరిశీలించిన మంత్రులు, ఇంజినీర్ల బృందం రెండు బుంగలతో ప్రమాదమేమి లేదని తేల్చారు.

నిర్మాణ సంస్థతో గ్రౌటింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆప్కాన్స్ సంస్థ ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి హెలికాప్టర్‌లో పాలియూరిథిన్​ అనే కెమికల్ తెప్పించి, వంతెనలోని 38, 28 పియర్‌ల వద్ద బుంగలకు గ్రౌటింగ్ పనులను చేయించింది. రెండు పియర్స్ వద్ద ఏర్పడిన సీపేజీ మరమ్మతు పూర్తిచేసింది. కానీ మళ్లీ నీటిబుంగలు ప్రత్యక్షమవ్వడం నిర్మాణసంస్థను కలవరపెడుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి

White Paper on Irrigation Projects : మరోవైపు రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య నీళ్లమంటలు కొనసాగుతున్నాయి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అధికార కాంగ్రెస్‌ మండిపడింది. వ్యర్థమైన ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని నేతలు దుయ్యబట్టారు. కాళేశ్వరంపై కేంద్ర సంస్థ కాగ్‌(CAG) విడుదల చేసిన నివేదికను సైతం శాసనసభలో ప్రవేశపెట్టారు.

కాళేశ్వరంపై ఆడిట్ నివేదిక ఇచ్చిన కాగ్(CAG Report On Kaleshwaram), అందులో ఇతర బ్యారేజీల అంశాన్ని కూడా ప్రస్తావించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల దిగువ భాగంలో కొంత మేర 2019 నవంబర్‌లోనే దెబ్బతిన్నట్లు తెలిపింది. 2019 నవంబర్‌లో వరద భారీగా రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని వెల్లడించింది. గేట్లు మూసిన తర్వాత ఆనకట్టల దిగువ భాగంలో ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడల్లో కొంత భాగం, దిగువ భాగంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని పేర్కొంది. ఫలితంగా 180.39 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వివరించింది.

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి

"నిధుల వరద పారిన కాళేశ్వరం - ప్రజలకు అక్కరకు రాకుండా పోయింది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.