ETV Bharat / state

తెలంగాణలో పోలింగ్‌ 64.93% - అత్యధికంగా భువనగిరిలో 76.47% - అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08% - TELANGANA LOK SABHA POLL PERCENTAGE

author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 7:02 AM IST

Telangana Lok Sabha Election Polling Percentage 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ దాదాపుగా 65 శాతం వరకు నమోదైంది. 10 నియోజకవర్గాల్లో పోలింగ్​ 70 శాతం దాటగా, గ్రేటర్​ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్​ మళ్లీ తక్కువే జరిగింది. నేటి సాయంత్రంతో కచ్చితమైన పోలింగ్​ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్​ రాజ్​ వెల్లడించారు. పోలింగ్​ కేంద్రాల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్​ రూంలకు తరలించారు.

Telangana Lok Sabha Election Polling Details
Telangana Lok Sabha Election Polling Details (ETV Bharat)

లోక్​సభ ఎన్నికలకు పోటెత్తిన ఓటర్లు - భారీగా నమోదైన పోలింగ్​ (ETV Bharat)

Telangana Lok Sabha Election Polling Percentage : రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు కొలిక్కి వచ్చిన లెక్కల ప్రకారం లోక్​సభ ఎన్నికల్లో పోలింగ్​ 64.93 శాతం నమోదైంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ 9 గంటల వరకు 9.51 శాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకొని 11 గంటలకు పోలింగ్​ శాతం 24.31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్​ పెరిగింది. ఇలా క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతానికి, సాయంత్రం 5 గంటలకు 61.16 శాతానికి పెరిగింది.

మావోయిస్టు ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్​ ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ సుమారు 1400 బూత్‌లలో అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు రాత్రి వరకు ఓట్లు వేశారు.

హైదరాబాద్​లో పోలింగ్ అత్యల్పం : ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం నమోదు అవ్వగా, అతి తక్కువగా హైదరాబాద్​లో 46.08 శాతం పోలింగ్​ జరిగింది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఈసారి కూడా పోలింగ్​ తక్కువగానే జరిగింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం

  • హైదరాబాద్‌ - 46.08 శాతం
  • సికింద్రాబాద్‌ - 48.11 శాతం
  • మల్కాజిగిరి - 50.12 శాతం
  • ఆదిలాబాద్‌ - 72.96 శాతం
  • చేవెళ్ల - 59.94 శాతం
  • కరీంనగర్‌ - 72.33 శాతం
  • ఖమ్మం - 75.19 శాతం
  • మహబూబాబాద్‌ - 70.68 శాతం
  • మహబూబ్ నగర్‌ - 71.54 శాతం
  • మెదక్‌ - 74.38 శాతం
  • నాగర్ కర్నూల్‌ - 68.86 శాతం
  • నల్గొండ - 73.78
  • నిజామాబాద్ - 71.50
  • పెద్దపల్లి - 67.88
  • వరంగల్‌ - 68.29
  • జహీరాబాద్‌ - 74.54 శాతం

సాయంత్రానికి పోలింగ్​ పూర్తి వివరాలు : ఇంకా పోలింగ్​ అధికారులు పోలింగ్​ లెక్కలను కొలిక్కి తెస్తున్నారు. ఈ సాయంత్రం వరకు కచ్చితమైన పోలింగ్​ శాతం తేలుతుందని సీఈవో వికాస్​ రాజ్ తెలిపారు. పోలింగ్​ పూర్తయ్యాక ఈవీఎంలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 స్ట్రాంగ్​ రూంలకు తరలించారు. సోమవారం ఒక్క రోజునే 400 ఫిర్యాదులు వచ్చి, 38 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​ తెలిపారు. పోలింగ్​ సజావుగా, ప్రశాంతంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్​కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. పోలింగ్​ను నేడు ఎన్నికల అధికారులు సమీక్షించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్​ అవసరమైతే నేడు నిర్ణయం తీసుకోనున్నారు. స్ట్రాంగ్​ రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు.

లోక్​సభ నాలుగో దశ ఎన్నికలు- ఓటింగ్ శాతం ఎంతంటే? - LOK SABHA POLLS 2024

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.