ETV Bharat / state

నేడు కేబినేట్ భేటీ - బడ్జెట్, రెండు గ్యారంటీల అమలుకి ఆమోదం!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 7:29 AM IST

Updated : Feb 4, 2024, 9:50 AM IST

Telangana Ministers Meeting 2024
Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting Today : బడ్జెట్, రెండు కొత్త పథకాల అమలు, గ్రూప్-1 వంటి అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. ఈనెల 8 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించి 10న మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

నేడు కేబినేట్ భేటీ

Telangana Cabinet Meeting Today : సచివాలయంలో మధ్యాహ్నం మూడున్నరకి రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై కేబినేట్ చర్చించనుంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి కాకుండా మధ్యంతర పద్దును ప్రవేశపెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక కేటాయింపులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పోటాపోటీ - 140 దాటిన అర్జీలు - ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి

Telangana Cabinet Meeting 2024 : శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగాన్ని కేబినేట్ భేటీలో ఖరారు చేయనున్నారు. ఈనెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తున్నారు. ఈనెల 8న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ఓట్​ ఆన్ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి ఐదు రోజులపాటు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే అవకాశంఉంది.

Telangana Cabinet Meeting on Budget 2024 : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ నెలలోనే అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకూ వైద్యసేవల హామీలను అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ.3,000ల కోట్లు అవసరమని అంచనా. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీల అమలును త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ రెండు పథకాలకు నేడు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.

గ్రూప్‌-1 పరీక్షపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. గ్రూప్-1లో సుమారు మరో 160 అదనపు పోస్టులు జోడించడం సహా కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు 20 అంశాలపై ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేడు నోటిఫై చేసే అవకాశంఉంది. గ్యారంటీల అమలు, కొత్త రేషన్ కార్డులు, మేడిగడ్డ బ్యారేజీపై విచారణ, సాగునీటి ప్రాజెక్టులు తదితర కీలక అంశాలపై కేబినెట్​లో చర్చ జరిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుంది: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీని ఆగం చేసే ఉద్దేశం మాకు లేదు : కేటీఆర్

Last Updated :Feb 4, 2024, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.