ETV Bharat / state

రైళ్లలో సెల్​ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్, ఓ వ్యక్తి హత్యతో పట్టుబడ్డ గ్యాంగ్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 8:01 PM IST

Secunderabad Murder Accused Arrested
Secunderabad Murder Accused Arrested

Secunderabad Murder Accused Arrested : సినీ ఫక్కీలో సెల్​ఫోన్​ దొంగలు రెచ్చిపోవడమే కాదు అడిగినందుకు ఓ అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన ఓ కీచక ముఠా సెల్ ఫోన్ దొంగతనం చేయడమే కాకుండా అడిగినందుకు ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి కడతేర్చారు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

Secunderabad Murder Accused Arrested : కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల సెల్​ఫోన్లే ఈ గ్యాంగ్ లక్ష్యం. ఎమరుపాటుగా ఉన్నవారి నుంచి కొట్టేసి పారిపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చాలారోజులుగా సికింద్రాబాద్ కేంద్రంగా చోరీలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్​ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత వారం క్రితం రేపల్లెకు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న అనిల్​ను లక్ష్యంగా చేసుకొని దొంగలు అతని సెల్​ఫోన్​ (Phone) చోరీ చేశారు. వెంటనే అప్రమత్తమైన అనిల్ రైలు దిగి వారిని వెంబడించాడు. ఫోన్ ఇవ్వమని అడిగినందుకు ఈ గ్యాంగ్ సభ్యులు దారుణంగా చంపేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఐదుగురు నిందితుల ముఠాను అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్​ తెలిపారు.

కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు - గుండెపోటుతో భార్య మృతి

Murder For A Cellphone : నంద్యాలకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు చర్లపల్లిలో ఓ ల్యాబ్​లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత వారం రేపల్లె ట్రైన్​లో వెళ్తుండగా ఈ గ్యాంగ్ అతని సెల్​ఫోన్ కొట్టేసింది. సెల్​ఫోన్ కోసం రైలు దిగి తన ఫోన్ ఇవ్వమని నిందితులను అడగగా రాహుల్ తన వెంట తీసుకువచ్చిన కత్తితో అతని పొత్తికడుపులో పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గ్యాంగ్​లో రాహుల్, సూరజ్, రవితేజ, లక్ష్మీనారాయణతో పాటు మరో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అనిల్ మృతి చెందిన వెంటనే అతని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జీహెచ్ఎంసీ చెత్త డబ్బా సమీపంలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు.

ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Murder : గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 70 సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులు దొంగిలించిన సెల్​ఫోన్లను విక్రయించి జల్సాలకు పాల్పడేవారు. తరచూ జల్సాల కోసం వీరంతా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు.

"రేపల్లెకు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న అనిల్​ను లక్ష్యంగా చేసుకొని దొంగలు అతని సెల్​ఫోన్​ చోరీ చేశాడు. ఫోన్ కోసం రైలు దిగి తన ఫోన్ ఇవ్వమని అడగగా రాహుల్ అనే వ్యక్తి తన వెంట తీసుకువచ్చిన కత్తితో అతని పొత్తికడుపులో పోడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ ప్రాణాలను బలిగొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రజలంతా రైళ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి."-గిరిధర్ ఈస్ట్ జోన్ డీసీపీ

సికింద్రాబాద్​​లో సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి తిరిగి ఇవ్వమని అడిగినందుకు యువకుడిని హత్య

బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు- కుంట తవ్వుతుండగా హత్య

గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.