ETV Bharat / state

మేం ఏ లోన్ తీస్కోలేదు సార్ - మాకేం తెల్వద్‌ - నాగర్​కర్నూల్​లో రైతు రుణాల పేరిట రూ.10కోట్లు స్వాహా - Farmer Loan Fraud in Nagarkurnool

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 8:22 AM IST

Farmer Loan Fraud In Nagarkurnool : ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలో వారంతా ఒకప్పుడు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రుణాలు రాకపోవడంతో అంతటితో విషయాన్ని మరచిపోయారు. కొనేళ్ల తర్వాత బ్యాంకు రుణాలు బకాయి ఉన్నారంటూ డీసీసీబీ బ్యాంకు నుంచి వారికి నోటీసులు అందాయి. తామసలు రుణమే తీసుకోలేదని, వాటితో అసలు సంబంధమే లేదని బాధితులు తెగేసి చెప్పారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట రూ.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. వ్యవహారం కోట్లలో ఉండటంతో బరిలోకి దిగిన సీఐడీ అధికారులు రుణకుంభకోణంపై తీగ లాగుతున్నారు.

Farmer Loan Fraud In Nagarkurnool
RS.10 crore Loan Fraud in Nagarkurnool (ETV Bharat)

ఏ రుణం సారు మేము తీస్కోలే మాకేం తెల్వదు నాగర్​కర్నూల్​లో రూ10కోట్లు రుణకుంభకోణం (ETV Bharat)

RS.10 crore Loan Fraud in Nagarkurnool : నాగర్ కర్నూల్ జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు రూ.10కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు నాలుగైదేళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటి బయటత పడుతోంది. బ్యాంకు అధికారులు లోతైన విచారణ జరపగా 1827 ఖాతాలకు సంబంధించి సుమారు రూ.10 కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రస్తుతం అమ్రాబాద్, పదర మండలాల్లోని వివిధ గ్రామాల్లో విచారణ జరుపుతోంది.

మరణించిన వారిపై లోన్​ మంజూరు చేసి : అప్పటి పీఏసీఎస్ ఛైర్మన్, బ్యాంకు మేనేజరు కుమ్మక్కై తమ పేరిట రుణాలు మంజూరు చేసి ఆ డబ్బుల్ని నొక్కేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకోసం అప్పట్లో ప్రతి గ్రామంలో వారు తమ ఏజెంట్లను నియమించుకున్నారని రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ సహా ఇతర దస్త్రాలను సేకరించారని చెబుతున్నారు. భూమిలేని వారి పేరుమీదా, మరణించిన రైతుల పేరుమీద రుణాలు మంజూరు చేసి అందిన కాడికి దండుకున్నారు.

చనిపోయిన రైతుల పేరుమీద రుణాల మంజూరు - కామారెడ్డిలో బ్యాంకర్ల అక్రమాలు

ఈ క్రమంలోనే నకిలీ దస్త్రాల సృష్టి, ఫోర్జరీ సంతకాలు, బ్యాంకును మోసం చేసి రుణాల మంజూరు, ఇతరుల పేరుమీద డబ్బుల స్వాహా లాంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తీసుకోని రుణాన్ని వడ్డీతో సహా చెల్లించమంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితిలో ఉన్న తాము ఆ రుణాలు కట్టలేమని వాపోతున్నారు.

"నేను ఒక్కరుపాయి కూడా తీసుకోలేదు. నాపైన లోన్ ఉందని చెప్పి కట్టమంటున్నారు. మాకు భూమి కూడా లేదు. నా పైన లక్ష రుపాయల లోన్​ తీసుకున్నట్లు ఉంది. మా అనుమతి లేకుండా లోన్ ఎలా మంజూరు చేస్తారు. తీసుకోని లోన్​కు ఇప్పుడు డబ్బులు కట్టమంటే ఎలా కడతాము. పొలాలు లేవు పట్టాలు లేవు అసలు మాకు రైతురుణం ఎలా ఇస్తారు? ఒక్కొక్కరిపై 50వేలు, లక్ష ఇలా తీసుకున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి?" - బాధితులు

శాఖాపరంగా చర్యలకు ఉపక్రమించిన డీసీసీబీ అధికారులను ఉన్నతధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. జరిగిన అక్రమాలపై జవాబు ఇవ్వాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం వారి ఆస్తుల జప్తునకు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ డీసీఓ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని, దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ రుణకుంభకోణానికి బాధ్యులెవరో గుర్తించి వారి నుంచే డబ్బు రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

రైతు రుణాల మోసం కేసులో రూ.255 కోట్ల ఆస్తులు జప్తు

మీకు తెలియకుండానే మీ పేరుతో లోన్ తీసుకున్నారా? మోసగాళ్లకు చెక్ పెట్టండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.