ETV Bharat / state

ఈ నెల 23 వరకు ప్రణీత్​రావు కస్టడీ - తొలి రోజు విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 2:35 PM IST

Updated : Mar 17, 2024, 3:18 PM IST

Nampally Court Allows Praneeth Rao Custody
Phone Tapping Case on Praneeth Rao

Praneeth Rao in Police Custody : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ ​రావును పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 7 రోజుల పాటు ప్రణీత్​రావును విచారించనున్నారు.

Praneeth Rao in Police Custody : కాల్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు శనివారం అనుమతించింది. దీంతో చంచల్​గూడ జైలులో ఉన్న ప్రణీత్​రావును పంజాగుట్ట పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ప్రణీత్​రావు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.

ప్రణీత్​రావు కస్టడీకి అనుమతించాలని ఈ నెల 13న ఆయనపై న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు నివేదికలో పోలీసులు పలు కీలక విషయాలు పేర్కొన్నారు. పరిశీలించిన నాంపల్లి కోర్టు పంజాగుట్ట పోలీసులకు ఏడు రోజులు పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. గ‌త ప్ర‌భుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా ప‌ని చేసిన ప్ర‌ణీత్​ రావుపై ఆధారాలు, ప్ర‌జా ఆస్తుల‌(Public Property) ధ్వంసం, ఎల‌క్ట్రానిక్ సాక్ష్యాలు టాంప‌రింగ్ ఆరోప‌ణలు ఉన్నాయి.

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు!

Phone Tapping Case on Praneeth Rao : ఆయ‌న‌కు అప్ప‌గించిన ప‌నినే కాకుండా, ఇత‌రుల ప్రొఫైళ్ల‌ను గోప్యంగా త‌యారు చేశార‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌ణీత్‌రావు ఎదుర్కొంటున్నారు. రహస్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్​డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్న ప్రణీత్​రావు, అక్రమాలు బహిర్గతం కాకుండా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

తాను డీఎస్పీగా ఉన్న సమయంలో తనతో పని చేసిన వారిని విచారిస్తే ప్రణీత్​ వారికి ఏం పనులు చెప్పాడు, హార్డ్​ డిస్క్​లు మాయం చేయాల్సినంత ముఖ్య సమాచారం(Important Data) అందులో ఏముంది అనే ప్రశ్నలకు ఆన్సర్స్​ దొరికే అవకాశం ఉందని పోలీసులు యోచిస్తున్నారు. తన కోసం స్పెషల్​గా ఆన్‌లైన్‌ కనెక్షన్‌ను కూడా ప్రణీత్‌రావు ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి పాత హార్డ్ డిస్క్‌లోని డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్టు వెల్లడించారు.

Nampally Court Allows Praneeth Rao Custody : ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజే చెరిపేశాడని వివరించారు. తర్వాత పాత హార్డ్ డిస్క్​ల పేరుతో కొత్త హార్డ్ డిస్క్​లను (New Hard Disks) అమర్చినట్టు తెలిపారు. ప్రణీత్​రావు నుంచి మూడు సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నట్టు వివరించిన పోలీసులు, ఈ కేసులో ప్రణీత్‌రావు సహా పలువురు ఎస్​ఐబీ అధికారులు, స్టాఫ్​ను ప్రశ్నించినట్టు వివరించారు.

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - ప్రణీత్ రావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్​

Last Updated :Mar 17, 2024, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.