ETV Bharat / state

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేయలేదు : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 6:15 PM IST

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy in Khammam

Ponguleti Srinivasa Reddy in Khammam : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముజ్జుగూడెం, నేలకొండ పల్లిలో పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో ఏమీ చేయలేదని విమర్శించారు.

Ponguleti Srinivasa Reddy in Khammam : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని సందర్శించారు. ముజ్జుగూడెంలో వెటర్నరీ ఆసుపత్రి భవన నిర్మాణానికి, నేలకొండపల్లిలో గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లిలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణకు పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, మీ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తానని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని కలిసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే - కుటుంబసమేతంగా సీఎంతో భేటీ

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత 48 గంటల లోపే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షలు ఇచ్చామని అన్నారు. అలాగే రూ. 500లకే గ్యాస్ బండ ఇస్తుందని, గ్రామ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని తెలిపారు.

ఖమ్మంలో పొంగులేటి పర్యటన : ఈ ప్రజపాలనలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన పథకాలు అమలు చేస్తామని తెలిపారు. రేపు 11వ తేదీన భద్రాద్రి రాముడు సన్నిధిలో ఇళ్ల స్థలం ఉన్న వారికి రూ. 5లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సమక్షంలో ఇస్తారని స్పష్టం చేశారు. పాలేరు నియోజక వర్గంలో మార్పు కావాలని మీరు తనను గెలిపించారని, మళ్లీ కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు.

మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొంగులేటి

Minister Ponguleti on New Ration Cards Issuing : రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti) పేర్కొన్నారు. గత ప్రభుత్వం మరిచిపోయిన కొత్త రేషన్‌కార్డుల జారీని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్ల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ "మీ అందరి దీవెనలతో శాసన సభ్యుడినయ్యాను. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, అది మీరు పెట్టిన భిక్షే. గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని అవమానాలు ఎదురైనా, వాటిని నిలదొక్కుకుని రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చారు. పదవులు, అధికారం శాశ్వతం కాదు మీ శీనన్నగా మీగుండెల్లో ఉంటాను అని" మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేయలేదు : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి

సోనియా గాంధీతో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ - తెలంగాణ నుంచి లోక్​సభ​కు పోటీ చేయాలని వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.