ETV Bharat / state

మీ ప్రాణాలు ఎంతో విలువైనవి - స్తంభాల నుంచి దిగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 5:39 PM IST

Updated : Mar 17, 2024, 9:33 PM IST

PM Modi Stop Pawan Kalyan Speech in Praja Galam Meeting At Chilakaluripeta: ప్రజాగళం మీటింగ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ కల్యాణ్​ ప్రసంగిస్తుండగా సభలో లైట్​ స్తంభాలపైకి ఎక్కిన వారిని దిగాలని ప్రధాని మోదీ మైక్​లో తెలిపారు.

PM Modi Stop Pawan Kalyan Speech in Praja Galam Meeting At Chilakaluripeta
PM Modi Stop Pawan Kalyan Speech in Praja Galam Meeting At Chilakaluripeta

PM Modi Stop Pawan Kalyan Speech in Praja Galam Meeting At Chilakaluripeta : చరిత్రలో నిలిచేలా చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. పల్నాడు జిల్లా చిలకూరిపేటలోని బొప్పుడి వేదికగా ప్రజాగళం బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్లొన్నారు. ఈ కార్యక్రమానికి మూడు పార్టీల నేతలు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. పది సంవత్సరాల తరువాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రావడంతో, ఎన్టీఏ సభకు ప్రజలు భారీస్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో సభ కిక్కిరిసిపోయిది.

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ

ప్రజాగళం బహిరంగ సభలో భాగం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. అధికార పార్టీ ఈ ఐదు సంవత్సరాలల్లో చేసిన వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ప్రసంగం సాగుతుండగా ఆసక్తికరణ సంఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలు బారికేడ్ల పైకి, లైటింగ్ టవర్లపైకి ఎక్కారు. ఈ ఘటనను ప్రధాని మోదీ గమనించారు. వెంటనే తన కూర్చున్న స్థానం నుంచి లేచి పనన్ అంటూ ప్రసంగాన్ని ఆపారు. అంతే అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

జనసేనాని మాట్లాడుతున్న పోడియం వద్దకు వచ్చి బారికేడ్ల పైకి, లైటింగ్ టవర్లపైకి ఎక్కిన వారిని కిందకు దిగాలని సూచించారు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరారు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలారు. పోలీసులు వెంటనే వారిని కిందకు దించాలని, ఏం చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. ఖాకీలు తీరుపై కొద్దిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వంటి పెద్దవారు చెబుతున్నారు అర్థం చేసుకోవాలని పవన్ కూడా చెప్పారు. చంద్రబాబు సైతం లేచి చేతి సంజ్ఞలతో దిగాలని సూచించారు. దీంతో అభిమానులు విద్యుత్ టవర్లు దిగారు. మోదీ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

శాండ్‌, ల్యాండ్‌, వైన్‌, మైన్‌, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు

Police failure exposed in praja Galam Public Meeting : ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం బయటపడింది. ముందస్తు ప్రణాళిక లోపంతో సామాన్య ప్రజలు, మూడు పార్టీల నేతలు ఇబ్బందులు పడ్డారు. కార్యకర్తలను నియంత్రించడంలో విఫలమవ్వడంతో మోదీ ప్రసంగానికి పదేపదే ఆటంకాలు ఏర్పడ్డాయి. పోలీసులు సహకరించని కారణంగా, సభకు వచ్చిన జనం రోడ్లపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

20 కిమీ. మేర స్తంభించిన ట్రాఫిక్ : సభా వేదిక ఎదురుగా 225 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించినా అందులోకి వాహనాలను మళ్లించలేదు. దీంతో సభకు వచ్చిన వాహనాలు జాతీయ రహదారిపై ఆగిపోయాయి. బొప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు సహకరించని కారణంగా రోడ్లపైనే చాలామంది జనం ఆగిపోవాల్సి వచ్చింది. పోలీసుల వైఖరిపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అనుమానాలు వెలిబుచ్చారు.

మీ ప్రాణాలు ఎంతో విలువైనవి - స్తంభాల నుంచి దిగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి

రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్‌

Last Updated :Mar 17, 2024, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.