ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో నుంచి ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల రుణం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 11:23 AM IST

Indiramma Housing Scheme 2024
Indiramma Housing Scheme 2024

Indiramma Housing Scheme in Telangana : తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం హడ్కో నుంచి రూ.3,000ల కోట్ల రుణాన్ని సమీకరిస్తోంది. ఇందుకు సంబంధించి హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Indiramma Housing Scheme in Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3,000ల కోట్ల రుణం సమీకరిస్తోంది. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు సర్కార్ వెల్లడించింది. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది.

Telangana Govt Loan at HUDCO : హడ్కో ఇచ్చే రూ.3,000ల కోట్ల రుణంతో గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇండ్లను నిర్మించ తలపెట్టినట్లు జీవోలో గృహ నిర్మాణ శాఖ పేర్కొంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఈనెల 11న తెలంగాణ సర్కార్ ప్రారంభించనుంది. అర్హులైన వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఒకవేళ సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయనున్నారు. మొదటి విడతగా అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలను కేటాయించాలని భావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి.

ఆకాశమే మీ లక్ష్యమైతే - అక్కడికి తీసుకెళ్లడానికి మేం రాకెట్​తో సిద్ధం : సీఎం రేవంత్​ రెడ్డి

Indiramma Housing Scheme 2024 : ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమై ఈ పథకం అమలుపై చర్చించారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారి కోసం ఇంటి నమూనాలు, డిజైన్​లను తయారు చేయించాలని అధికారులకు ఆయన ఆదేలిచ్చారు.

లబ్ధిదారులు సొంత ఇళ్లు తమకు నచ్చినట్లుగా నిర్మించుకున్నప్పటికీ అందులో తప్పనిసరిగా వంటగది, టాయిలెట్​ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షింటే బాధ్యతలను కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఇంజినీరింగ్​ విభాగాలకు అప్పగించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్​ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్​ బెడ్​రూం(Double Bed Room Scheme) ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా చూడాలని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుతు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. తాజాగా గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్​ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ఈ నెల 11న ప్రారంభించనుంది.

‘గృహలక్ష్మి’ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం - ఆశావహుల ఎదురుచూపులు

ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో 'రియల్‌' దందా.. నకిలీ పట్టాలతో గుట్టుచప్పుడు కాకుండా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.