ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ముగ్గురి మృతి - స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి - Heavy Rains Effect in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 5:59 PM IST

Updated : May 12, 2024, 7:15 PM IST

Heavy Rains Effect in Telangana : రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్​, మెదక్​, సంగారెడ్డి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్​, మెదక్​ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వారి మృతి పట్ల సీఎం రేవంత్​ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Etv Bharat
Heavy Rains Effect in Telangana (ETV Bharat)

Heavy Rains Effect in Telangana : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు​ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్​, మెదక్​ జిల్లాల్లో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో పిడుగు పడి తాత-మనవడు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పిడుగు పాటుతో గాయపడిన ఐదుగురికి వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన తాతా మనవళ్లు : పిడుగుపడి తాతా మనవళ్లు మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని రామోజీపల్లిలో చోటుచేసుకుంది. వర్షం కురుస్తుండటంతో స్థానిక ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడుస్తోందని చెప్పి పల్వంచ శ్రీరాములు (51), అతని మనుమడు విశాల్ (11) వడ్ల కుప్పల మీద టార్పాలిన్లు కప్పడానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చి, పిడుగు పడే పరిస్థితి కనిపించింది.

చెట్టు కిందకు వెళితే పిడుగు పడుతుందనే భయంతో వర్షం పడుతున్నా ఖాళీ సంచులు తలపై కప్పి వడ్ల కుప్ప దగ్గరే ఉన్నారు. అయితే వారికి సమీపంలోనే పిడుగు పడటంతో శ్రీరాములు, విశాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూహ్యంగా పిడుగుపడి తాతా మనవళ్లిద్దరూ మృతి చెందడంతో రామోజీపల్లి లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

CM Revanth Issued Key Orders To Officials : భారీ వర్షాల పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో గాలివాన, పిడుగులు పడిన వివరాలపై సీఎం ఆరా తీశారు.

ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా అధికారులు, సిబ్బంది వెంటనే స‌హాయ‌క చ‌ర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుతో గాయపడిన ఐదుగురికి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Rain Storm in Mancherial : గాలివాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

ఆదిలాబాద్​లో పిడుగు పాటుకు వ్యక్తి మృతి : ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనథ్‌ మండలం గిమ్మ గ్రామ శివారులో పిడుగుపాటుకు అయిదుగురు వ్యక్తులు గాయాలపాలవ్వటం కలకలం సృష్టించింది. వీరిలో గిమ్మ గ్రామానికే చెందిన మామిడిపల్లి కిరణ్‌ అనే వ్యక్తి మృతి చెందటం స్థానికంగా విషాదం నింపింది. ఎంపీటీసీ సభ్యుడు కోల భోజన్న, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌, ఉప సర్పంచ్ భర్త రమేష్‌లకు గాయాలవ్వగా, సంటెన్న అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ బాధితులను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు.

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో కూలిన టెంట్లు : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గాలి, ఉరుముల మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షంతో జిల్లా కేంద్రం అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో టెంట్లు పూర్తిగా కింద పడిపోయినాయి.

దీంతో టెంట్ కింద ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది పాఠశాల గదులలోకి వెళ్లి తలదాచుకున్నారు. వర్షంలోనే వర్షంలోనే ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుని బస్సులలో బయలుదేరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి చాలా కష్టమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

పగలు భగభగలు సాయంత్రం పిడుగులు - రాష్ట్రంలో గాలివాన బీభత్సం - UNTIMELY RAINS IN TELANGANA 2024

రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం - పిడుగుపాటుకు ఇద్దరు మృతి - Heavy Rains Effect in Telangana

Last Updated : May 12, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.