ETV Bharat / state

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగానే జరుగుతోంది : డీఎస్ చౌహాన్ - DS Chauhan on Grain Procurement

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 5:53 PM IST

DS CHAUHAN ON PADDY PROCUREMENT
DS Chauhan on Grain Procurement in Telangana

DS Chauhan on Grain Procurement in Telangana : రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగానే సాగుతోందని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ తెలిపారు. ఇవాళ పౌరసరఫరాల భవన్‌లో ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించిన ఆయన, రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

DS Chauhan on Grain Procurement in Telangana : రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ (DS Chauhan) అన్నారు. ప్రతిరోజు జిల్లాల వారీగా అన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణపై తాము సమీక్షిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పందించారు. తాజాగా సాగుతున్న ధాన్యం సేకరణ, పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ధాన్యం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన దృష్ట్యా రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వడ్లు అమ్ముకోవాలి : గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరలు చెల్లిస్తున్నందున రైతులెవరూ ఎంఎస్​పీ(minimum support price) కంటే తక్కువ ధరలకు అమ్ముకోవద్దని డీఎస్ చౌహాన్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ, ఇప్పటి వరకు 6919 కేంద్రాలు తెరిచి సరకు సేకరిస్తుందని స్పష్టం చేశారు. పల్లెల్లో దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు వడ్లు అమ్ముకోవాలని సూచించారు.

ఎఫ్​సీఐ(FCI) నిబంధనలు ప్రకారం 17 శాతం తేమ ఉన్న వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకురావాలని, కొన్ని చోట్ల 50 శాతం పైగా తేమ వస్తుందని తమ దృష్టికి వచ్చిందని డీఎస్ చౌహాన్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.

'ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. మన రాష్ట్రం నుంచి బయటకు పోయిన ప్రాబ్లమ్​ లేదు కానీ బయట నుంచి రావద్దు. రైస్​ మిలర్లతో మీటింగ్​ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వెంటనే రైతులకు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రైతుల నుంచి ధాన్యం సేకరించిన రెండ్రోజుల్లో నగదు చెల్లింపులు చేస్తున్నాం.'-డీఎస్‌. చౌహాన్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుగుతోంది : డీఎస్ చౌహాన్

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు : రేవంత్​ రెడ్డి - REVANTH REDDY on paddy procurement

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు రైతులకు నష్టం కలిగిస్తే - కఠిన చర్యలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి - CM Tweets On paddy procurement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.