ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు - బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 9:58 AM IST

Congress Focus on Lok Sabha MP Candidates : లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ కొనసాగుతోంది. మెజార్టీ స్థానాలు కైవవసం చేసుకోవడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నెల 18న పలువురు బీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ కండువాకప్పుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Congress Candidates List
Congress Focus on Lok Sabha MP Candidates

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

Congress Focus on Lok Sabha MP Candidates : బీఆర్​ఎస్​, బీజేపీలు అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను వేగవతం చేయగా కాంగ్రెస్‌ ఇందులో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు గెలుపునే ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తోంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీఆర్​ఎస్​, బీజేపీలో అసంతృప్తులుగా ఉన్న నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకుని (Congress Joinings) వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారికి కూడా అన్యాయం జరగకుండా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టులు అందుబాటులో ఉండడంతో అసంతృప్తి చెలరేగకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్‌ గూటికి జితేందర్ రెడ్డి - కేబినెట్‌ హోదా ఇచ్చిన అధిష్ఠానం

తాజాగా మరో బీఆర్​ఎస్​ సిట్టింగ్‌ ఎంపీ కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే చేవెళ్ల నుంచి బరిలో దిగాల్సిన సునీతా మహేందర్‌రెడ్డి మల్కాజిగిరికి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉండడంతో మల్కాజిగిరి బరిలో ఎవరుంటారనే విషయం ఆసక్తిక రేపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇందులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువాకప్పుకుంటే ఆయనకు సికింద్రాబాద్‌ టికెట్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Congress Special Focus on Hyderabad MP Seat : ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే హైదరాబాద్ నుంచి మస్కటి డెయిరీ యజమాని బరిలోకి ఉంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్‌ (Karimnagar MP Seat) నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ప్రవీణ్‌ రెడ్డి స్థానంలో వెలమ సామాజిక వర్గానికి రాజేందర్‌ను బరిలో దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డికి (MLC Jeevan Reddy) టికెట్‌ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ ఇక్కడ పోటీకి మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్‌కుమార్‌ పట్టుబుడుతున్నట్లు తెలుస్తోంది.

13 స్థానాల అభ్యర్థుల కోసం కాంగ్రెస్​ కసరత్తు - హైదరాబాద్​ సీటుపై స్పెషల్​ ఫోకస్​

వరంగల్‌లో దొమ్మాటి సాంబయ్య, ఇందిరా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ తాజాగా పార్టీలో చేరిన సిట్టింగ్‌ ఎంపీని బరిలో నిలిపే అవకాశం లేకపోలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఆయనకే టికెట్‌ దక్కే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి లంబాడీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌, ఆదివాసీ సామాజిక వర్గానికి ఆత్రం సుగుణల మధ్య పోటీ నెలకొంది.

అభ్యర్థుల ఎంపికపై నాయకుల అభిప్రాయాలు - గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం

భువనగిరి (Bhuvangiri MP Ticket) నుంచి చామల కిరణ్‌రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సతీమణి లక్ష్మి పేర్లు తెరపైకి వచ్చాయి. నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవిని బరిలో దించేందుకు ఏఐసీసీతో పాటు రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మం టికెట్‌పై తీవ్రమైన పోటీ వల్ల ఏఐసీసీ స్థాయిలో నిర్ణయం జరుగుతోందని తెలుస్తోంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి టికెట్‌ ఇస్తే రాజేందర్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న సునీల్‌ కనుగోలు ఇచ్చే ఫ్లాష్‌ సర్వేలు, పీసీసీ నుంచి ఇచ్చే జాబితాను పరిశీలించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నేతలు తెలిపారు.

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.